విశ్వనాథన్ ఆనంద్ హృదయనాథ్ పురస్కారం..
ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న ఆయనకు హృదయనాథ్ పురస్కారం దక్కింది. సాధారణంగా ఈ పురస్కారం దేశంలో వివిధ రంగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన, విజయవంతమైన వ్యక్తులను ఈ పురస్కారంతో గౌరవిస్తారు. ఇప్పుడు ఈ పురస్కారం ఈయనను వరించింది. ఈ పురస్కారానికి ఎంపికైన విశ్వనాథన్ ఆనంద్ కు రూ.2 లక్షల నగదు, ఒక జ్ఞాపిక ను అందజేయనున్నారు. ఈ నెల 12వ తేదీన మహారాష్ట్రలో జరిగే కార్యక్రమంలో గవర్నర్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. కాగా గతంలో ఈ అవార్డును అందుకున్న వారిలో లతా మంగేష్కర్, బాబా సాహెబ్ పురందరె, ఆశా భోంస్లే, అమితాబ్ బచ్చన్, హరిప్రసాద్ చౌరాసియా, ఏఆర్ రెహ్మాన్ తదితర ప్రముఖులు ఉన్నారు.