కేసీఆర్ శ్రీవారికి చేయించిన ఆభరణాలు ఇవే
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే తిరుమల శ్రీవారు, విజయవాడ కనకదుర్గమ్మ, వరంగల్ భద్రకాళీ, కురివి వీరభద్రస్వామికి బంగారు అభరణాలను చేయిస్తానని మొక్కుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల తర్వాత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. అనుకున్నట్లుగానే దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తానని దానికి నిధులు కూడా విడుదల చేశారు.
సాంస్కృతిక శాఖ సలహాదారుడు కేవీ రమణాచార్యులను ఆభరణాల కమిటీకి ఛైర్మన్గా నియమించారు. ఆభరణాల తయారీ టెండర్లను తమిళనాడులని కొయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ కాలిదాస్ జ్యువెలర్స్ దక్కించుకుంది. దీనిలో తొలి విడతగా తిరుమల వెంకన్న ఆభరణాలైన శాలిగ్రామ హారం, మకరకంఠ సిద్ధమయ్యాయి. 20 కిలోల బరువుతో సుమారు 5 కోట్లు వెచ్చించి వీటిని తయారు చేశారు. ఈ నెలాఖరున సీఎం కేసీఆర్ తిరుమలకి వెళ్లి మొక్కు చెల్లించనున్నారు.