జపాన్లో మళ్లీ సునామీ హెచ్చరికలు
posted on Mar 28, 2011 @ 2:54PM
టోక్యో: తూర్పు జపాన్లో 6.5 తీవ్రతతో సోమవారం భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీంతో జపాన్లో స్వల్పస్థాయిలో సునామీ హెచ్చరికలను ప్రకటించారు. అయితే, ఈ ప్రకంపనల వల్ల జరిగిన నష్టం, గాయపడిన వారి సమాచారం తెలియరాలేదు. కాగా మియాజి ప్రాంతంలో 1.6 అడుగుల మేర అలలతో కూడిన సునామీ వచ్చినప్పుట్లు జపాన్ మెటరలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఆ ప్రాంతంలో జపాన్ సునామీ హెచ్చరికలు ప్రకటించింది. అయితే హవాయి, అమెరికా పశ్చిమ తీరంలో సునామీకి సంబంధించిన ఎలాంటి జాడలు లేవని అమెరికా, ఫసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. జపాన్లో స్థానికి కాలమానం ప్రకారం సోమవారం ఉదయం హోన్స్ తూర్పు తీర ప్రాంతాల్లో భూప్రకంపనాలు చోటుచేసుకున్నట్లు, 5.9 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మార్చి 11న జపాన్ ఈశాన్య తీరంలో 9తీవ్రతతో సంభవించిన తీవ్రమైన ప్రకృతి విపత్తు సుమారు 18,000 మందిని బలిగొన్న సంగతి తెలిసిందే.