అల్పసంతోషంలో 'కర్ణాటక' ప్రియులు!

- ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

 

 

కర్కాటకం 'బింది'స్తే కాటికముండదంటారు! కాని అదే కర్కాటకం 'వర్షిస్తేన'ట కాడీ, మోకూతడవనే తడవదట! ఈ రెండు సామెతలూ ఎందుకుపుట్టాయోగాని కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసి, మరో ప్రత్యామ్నాయ దీటైన రాజకీయపక్షం లేని పరిస్థితులలో నిలువెల్లా అవినీతితో దేశావ్యాప్తితంగా భారీ 'గాయాల'తో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ వూపిరి పోసుకున్నట్టు భావిస్తోంది! కాని 'కర్కాటకం వర్షిస్తే కాంగ్రెస్ పాలనలో కాడీ, మోకూతడవవట! అసెంబ్లీలో మెజారిటీ సీట్లు సాధించుకున్నానన్న 'సంబరం'లో సీట్లసంఖ్యకు (122) దీటుగా ప్రజాబాహుళ్యం నుంచి వోట్ల శాతం లేదన్న సత్యాన్ని మభ్యపరచాలని ఆ పార్టీ విశ్వప్రయత్నం చేస్తోంది. కాని కాంగ్రెస్ కు పోలైన వోట్లు కేవలం 37 శాతం కాగా, మిగతా పెద్దా, చిన్నా చితక పార్టీలన్నింటికీ పోలైన మొత్తం వోట్లు 63 శాతం! వీటిలో చిన్నా, చితకా పార్టీలు పోనూ కాంగ్రెస్ కు ప్రధాన పోటీదారు, నిన్నటిదాకా అధికార పక్షంగా ఉన్న భారతీయ జనతాపార్టీ (బి.జె.పి.) గతంకన్నా 70సీట్లు కోల్పోగా, బిజెపితో సమానస్థాయిలో సీట్లు గెలుచుకున్న జనతాదళ్ (సెక్యూలర్)పార్టీకి ఈసారి అదనంగా 12 సీట్లు గుంజుకోగల్గింది.


అయితే అన్నింటికన్నా ఇక్కడ గమనించవలసిన ప్రధాన విషయం, కర్ణాటక వరకు చాలా కాలంగా బరాబరి పోటీలో ఉంటూ వస్తున్నది [కొన్నాళ్ళపాటు దేవగౌడా పార్టీ తప్ప] సెక్యూలర్ వ్యతిరేకి అయిన "హిందూత్వ'' గ్రూపు బిజెపి మాత్రమే! అందువల్ల 'సెక్యూలరిజం' పేరిట మత రాజకీయం చేయడానికి సంకోచించని కాంగ్రెస్, బిజేపిల మధ్య మాత్రమే కర్ణాటక వరకూ ప్రధానమైన పోటీ గమ్మత్తేమంటే, ఈ రెండు పార్టీలను తోసిరాజనగల బలమైన మూడవ రాజకీయశక్తి ఏదీ ఎదిగి రాకపోవడంవల్ల కర్ణాటక మెజారిటీ ప్రజాబాహుళ్యానికి మరొక విశ్వసనీయమైన శక్తి కన్పించనందున ప్రధాన ఎన్నిక కాంగ్రెస్-బిజేపిల మధ్య పోటీకే పరిమితం కావలసివచ్చింది.

 

ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక అంశంపై కేంద్రీకరించింది - "బిజెపి అవినీతి పాలనను అంతం చేయండి'' అన్న నినాదంపైన!  అదే నినాదాన్ని కర్ణాటక కాంగ్రెస్ లంకించుకుంది. అక్కడ పోటీ వరకూ బిజెపి అవినీతిలో కాంగ్రెస్ అవినీతిని ప్రత్యామ్నాయంలేని దశలో వోటర్లు చూడగాలిగినా వోటర్లకు మరో దిక్కులేని పరిస్థితి. కాగా అసలు విషయం - కర్ణాటకలో తక్కువ శాతం వోట్లతో అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ ఫలితాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోని కొందరు 'చంకలు గుద్దు'కుంటూ అల్పసంతోషం వ్యక్తం చేసి, ఆంధ్రప్రదేశ్ లో కూడా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్సే 'పాగా'వేయగలదని భావిస్తున్నారు. "కర్నాట్టకలో బిజెపి పాలన (సోనియా మాటల్లో)అవినీతిమయం'' కాబట్టి అక్కడ బిజెపి వోడిపోయిందని కాంగ్రెస్ వారు భావించటం "గురువింద గింజ తన నలుపెరగదన్న''ట్టుగా దేశవ్యాపితంగా సంఖ్యాతీతమైన కుంభకోణాలతో తీసుకుంటూ 2014లో ప్రజలనుంచి పరాభవం చవిచూడబోతున్నదన్న స్పష్టమైన సంకేతాలను కూడా ఇక్కడి కాంగ్రెస్ పెద్దలూ, ఢిల్లీలోని అధిష్ఠానవర్గమూ గుర్తించలేకపోతున్నారు. ఇది "మేకపోతు గాంభీర్యమై''నా కావాలి, లేదా సుప్రీంకోర్టు కేంద్రంపైన, సిబీఐపైనా పదే పదే పెడుతున్న మొట్టికాయల పట్ల అంతరంగికంగా పెరిగిపోతున్న 'గుబులు' అయినా కావాలి!

 

కర్ణాటకలో "బిజెపి అవినీతికి నిరసనగా''నే అక్కడి ప్రజలు తీర్పు చెప్పిన పక్షంలో అంతకన్నా వందరెట్లు కాంగ్రెస్ పాలనావ్యవస్థలోని వేళ్ళమీద లెక్కించదగిన ఏ కొలదిమందో తప్ప మిగతా రాజకీయాలు, అధికార యంత్రాంగమూ పేకమోయ్యా (ప్రధానమంత్రిసహా) అవినీతి ఆరోపణలతో తీసుకుంటున్న దశలో కాంగ్రెస్ పార్టీ కూడా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని లేదా ఘోర పరాజయాన్ని తప్పించుకోలేదు; తప్పించుకోగల అర్హతను రోజుకొక తీరులో ఎన్ని కొత్త చిట్కాలు పన్నినా కాంగ్రెస్ కోల్పోతుంది. కర్ణాటక "విజయం''పై కాంగ్రెస్ వర్గాల్లోని అల్పసంతోషం 'స్థాయి' ఎలాంటిదో ఫలితాలు వెలువడిన రోజున (8-05-2013) పి.చిదంబరం కాస్సేపు తన ఆర్థికమంత్రి పదవిని పక్కకు నెట్టుకుని "టీవీ రిపోర్టరు''గా అవతారమెత్తి తనకు ఎదురైనా బిజెపి సీనియర్ నాయకుడు మాజీ ఆర్థికమంత్రి జస్వంత్ సింగ్ నోటిముందు మైక్ పెట్టి కర్ణాటక ఫలితాలపై వ్యాఖ్యానించమని వ్యంగ్యం ప్రదర్శించాడు. అందుకు జస్వంత్ యిచ్చిన సమాధానం : "ప్రజలెప్పుడూ సరైన పాలనకే వోటేస్తారు. సరైన పాలన అందించకపోతే నిన్నూ ఓడించేస్తారు'' అన్నాడు! దాంతో పాలుపోని చిదంబరం "చూడండి, ఆయన (జస్వంత్) ఎంత పెద్దమనిషో'' అని మైక్ ను విలేఖరికిచ్చేశాడు!

 

కాని ఈ 'అల్ప'సంతోషం' లో చిదంబరం తిరిగి తనకే ఎదురుతిరిగే ప్రశ్నలేన్నింటినో మరిచిపోయాడు! "ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా ప్రజలకు సుపరిపాలన అందించాల్సిందే''నని జస్వంత్ నోటనే పునరుక్తి దోషంతో వల్లెవేసినా, ఇంతకూ దేశంలో అవినీతి రహితమైన "సుపరిపాలన''ను కాంగ్రెస్ అందిస్తున్నదో లేదో నీళ్ళునమలకుండా చెప్పగల స్థితిలో చిదంబరం లేడు, ఆయనే కాదు, యు.పి.ఎ. ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న యావత్తు కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలో ఎవరూ లేరనే చెప్పాలి. ఎందుకని? ప్రపంచబ్యాంకు "ప్రజావ్యతిరేక సంస్కరణల''ను ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్య పెట్టుబడివ్యవస్థకు, విదేశీ బహుళజాతి గుత్తసంస్థల (మల్టీనేషనల్ కంపెనీల)ను, వారితో మిలాఖత్తయి భారత పేద, మధ్యతరగతి వర్గాలను దోచుకుతినే స్థానిక గుత్తేదారులకు ప్రయోజనం చేకూర్చగల ఆర్థికవ్యవస్థను నిర్మూలించడానికే పాలనావ్యవస్థ కంకణం కట్టుకుంది కాబట్టి - కాంగ్రెస్, బిజెపిలు సుపరిపాలన అందించలేవని రుజువైపోయింది. అందుకే అమెరికాలో మాదిరే ఇక్కడ కూడా ప్రజాప్రయోజనాలకు అనుకూలమైన బలమైన మూడవ ప్రత్యామ్నాయ రాజకీయశక్తిని పెట్టుబడివ్యవస్థ ఎదగానివ్వదు. ఉన్న వామపక్షాల బలహీనతలను కాంగ్రెస్-బిజెపిలు ఇప్పటికే బాగా కాచివడపోశాయి!
 

ఈ పరిణామక్రమంలో భాగంగా దేశ ఆర్థికవ్యవస్థను కనీసం రాజ్యాంగ చటానికి ప్రాణప్రదంగా ఎంచుకున్న "ప్రియాంబుల్'' (ఉద్దీపన) మౌలికలక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్దేదిపోయి ప్రకటిత సోషలిస్టు తరహా సంక్షేమ రాజ్యనిర్మాణానికి కట్టుబడకపోగా, ప్రజాస్వామ్య భావాలకు సహితం ఎసరు తెచ్చిపెడుతున్న పరిణామాలకు కాంగ్రెస్ పాలన దోహదం చేయటం 'సుపరిపాలన' ఎలా అవుతుందో చిదంబరం చెప్పాలి! దేశ పారిశ్రామిక, వ్యవసాయక, సంక్షేమ, వస్తూత్పత్తి, సహకార రంగాలన్నిటా ప్రపంచబ్యాంకు "సంస్కరణల''ద్వారా విషమ ఫలితాలకు తలుపులు తెరవడాన్ని 'సుపరిపాలన'గా ఎలా చెప్పగలం? చివరికి కార్మిక చట్టాలను, బహుళజాతి గుత్తసంస్థల ప్రయోజనాలకు, వాటిని దేశంలోకి యధేచ్చగా అనుమతించడానికి వీలుగా సవరించడానికి అనుమతిస్తూ న్యాయవ్యవస్థను కూడా అందుకు అనుగుణంగా మరల్చడానికి గజ్జెకట్టిన కాంగ్రెస్-బిజెపి పాలనావ్యవస్థలను 'సుపరిపాలన'గా ఎలా ప్రజాబాహుళ్యం గుర్తించగలదు? 'సంస్కరణల' పేరిట ప్రభుత్వరంగ విస్తరణను కుంచింపజేసి లాభాల వేటకు అర్రులు చాచిన ప్రయివేట్, కార్పోరేట్ రంగాలను అనేక రాయితీలు కల్పించేందుకు కాంగ్రెస్, బిజెపి పాలనావ్యవస్థలను ప్రపంచబ్యాంకు కేవలం 'బ్రోకర్ ల'పాత్ర ("ఫెసిలిటేటర్'')స్థాయికి ఆదేశాపూర్వకంగా దిగజార్చడాన్ని ఎలా 'సుపరిపాలన'గా భావించగలం?

 

రూ 5 1/2లక్షలకోట్ల ప్రజాధనం బడా వర్గాలనుంచి రుణాల రూపేణా రిజర్వుబ్యాంకికి మొండిబకాయిలుగా మారడాన్ని అవి ఎగవేతలుగా మారడాన్ని 'గుడ్లు అప్పగిస్తూ' కూచునే పాలనావ్యవస్థల్ని 'సుపరిపాలన'గా ఎలా పరిగణించగలం? ఆ మాటకొస్తే స్విస్ బ్యాంకుల్లో ఏళ్ళూ వూళ్ళుగా మూలుగుతున్న భారతీయ బడావర్గాల సామూహిక నల్లధనం (బ్లాక్ మనీ)రూ.24 లక్షల కోట్లను ముట్టుకోడానికి సాహసించలేకపోయిన పాలనా వ్యవతలు 'సుపరిపాలన' కింద ఎలా జమకట్టగలం? దేశ సహజసంపదైన రేడియో తరంగాలను తమ హక్కు భుక్తం చేసుకుని దేశీయ టెలికాం వ్యవస్థను ప్రజల వినియోగానికి అందుబాటులో లేని 'మూల్యం' వసూలు చేయడానికి వీలుగా 122 లైసెన్సులను విదేశీ, స్వదేశీ గుత్త సంస్థలకు బదలాయించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ లైసెన్సులను రద్దుచేసే దాకా 'నాలిముచ్చుగా' మౌనముద్ర నటించే పాలనా వ్యవస్థను 'సుపరిపాలన'గా ఎలా నమోదవుతుందో జస్వంత్, చిదంబరంలే సమాధానం చెప్పగలరా?
 

పైన తెల్పిన బకాయిలు, గుప్తధనం సహా దేశంలో సుమారు మరో పదిలక్షల కోట్ల రూపాయల దాకా చెలామణిలో ఉన్న దొంగడబ్బును వెలికి తీయడానికి [పదేళ్ళనాదే రిజర్వుబ్యాంకు ముందు అఫిడవిట్ లో కేంద్రం, దేశంలో చెలామణిలో ఉన్న పోటీ ఆర్థిక వ్యవస్థ విలువ రూ.5 లక్షల కోట్లని వెల్లడించింది] ముందడుగు వేయడంలో విఫలమైన పాలనా వ్యవస్థ 'సుపరిపాలన', ఆదర్శ పరిపాలన ఎలా కాగల్గుతుంది?
 

దేశీయ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలలో భాగస్వాములు కావలసిన చిన్న చిన్న రిటైల్ వర్తక వ్యాపారసంస్థలను సహితం మింగివేసే వాల్ మార్ట్ లాంటి బడా మల్టీనేషనల్ కంపెనీలకు 'ఎర' చేయడానికి దారులు తెరిచిన పాలనావ్యవస్థను 'సుపరిపాలన' కింద జనం ఎలా పరిగణిస్తారు? చివరికి ఇప్పటికే దేశ పేద, మధ్యతరగతి అసంఖ్యాక ప్రజాబాహుళ్యం మూల్గుల్ని పీల్చడంలో అగ్రస్థాయి కార్పోరేట్ సంస్థలకు ప్రభుత్వం పన్నులు, సబ్సిడీల రూపంలో ఎన్ని రకాలుగానో రాయితీలు కల్పిస్తున్నా చాలవన్నట్టు, మరిన్ని రాయితీల కోసం వత్తిడి చేస్తూ "రాయితీలు అడిగిన మేరకు కల్పించకపొతే విదేశీ గుత్త పెట్టుబడులను రానిచ్చేది లేద''ని విదేశీ కార్పొరేట్లు అవే రాయితీలను 'మాకూ' కల్పించాలని దేశీయ కార్పోరేట్లూ అలిగి, భీష్మించుకుకొని కూర్చుంటే వాటి వైఖరిని దుమ్ముదులిపేది పోయి 'దువ్వి' దగ్గరకు తీస్తున్న పాలనావ్యవస్థ 'సుపరిపాలన' ఎలా అందివ్వగలదు? ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలలోని 23 బ్యాంకులూ, భీమా కంపెనీలూ 'హవాలా' ధనంతో లావాదేవీలు మాదకద్రవ్య వ్యాపారాలు సాగించడానికి వీలు కల్పించిన సంస్కరణలను తలకెత్తుకున్న పాలనావ్యవస్థ ప్రజలకు ఎలాంటి 'సుపరిపాలన'ను అందించగలదో ప్రజలు తెలుసుకోగోరుతున్నారు?!

 

ఇటీవలనే ఒక బడా "ఈక్విటీస్'' సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలోని 54 బడాసంస్థల వద్ద నగదు రూపంలోకి మార్చుకోగల రూ.4,30,000 కోట్ల కిమ్మతుగల క్యాషు, దానికి సమానమైన ద్రవ్య మాధ్యమ పత్రాలు [వీటిని "పేపర్ ఇన్ స్ట్రుమెంట్స్'' అంటారు. వీటిని తేలిగ్గా నగదుగా మార్చుకోవచ్చు] ఉన్నాయని వెల్లడయింది! అంటే, దేశప్రయోజనాలకు వినియోగపడగల ఉత్పత్తి రంగానికి చెందిన ఉత్పాదక కార్యకలాపాలలో పెట్టుబడులుగా పెట్టే బదులు అనుత్పాదక రంగాలకు మరలిపోతోంది. ఇలా మరలి తరలిపోయే పెట్టుబడి దేశ స్థూల జాతీయోత్పత్తుల [జి.డి.పి.] విలువలో 4.3 శాతం ఉందని సాధికార అంచనా! ఈ తరలింపును అడ్డుకోకుండా పేదసాదలపైన, మధ్యతరగతిపైన మోయలేని భారాన్ని మోపి, నియంత్రణ వ్యవస్థలోనూ, అక్కౌంటింగ్, న్యాయవాద వ్యవస్థల్లోనూ విదేశీసంస్థల జోక్యానికి బీజాలు నాటిన పాలనావ్యవస్థ నిర్వాహకుల్ని 'సుపరిపలకులు'గా ఎలా గుర్తించగలమో కర్ణాటక ఫలితంపై 'జబ్బలు' చరుచుకుంటున్న కాంగ్రెస్ నాయకులు గుండెలమీద చేయి వేసుకుని చెప్పగలగాలి! ఇది దేశవ్యాపిత దృశ్యం! కర్నాటకం, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిఫలించదనుకోవడం భ్రమ!

పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

పంచాయతీ ఎన్నికలలో తొలి విడత ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో  కలవరం మొదలైంది. ప్రచారానికి  వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. వారికి కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సారి గ్రాయపంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం (డిసెంబర్ 9)  సాయంత్రంతో ముగియనుంది.  అదలా ఉండగా.. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన  ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మరో పక్క మూడో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయ్యింది. దీనికి సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అంతే కాకుండా ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.

పుత్రిక రాజ‌కీయ అరంగేట‌గ్రం.. గ్రౌండ్ ప్రిపరేషన్ లో బొత్స!

బొత్స సత్యనారాయణ.. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నాత‌నదైన రాజ‌కీయం చేయ‌డంలో ఆరితేరిన వార‌న్న పేరుంది ఆయనకు.  విజయనగరం రాజ‌కీయాల్లో బొత్స ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది ఉన్నారు. కానీ.. ఇప్పుడు బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు.  ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి  సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.   ఈ క్రమంలోనే  తాను పొలిటికల్ గా యాక్టివ్‌గా ఉన్నప్పుడే వారసుల్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని అంటున్నారు.  తన కుమార్తె తన కుమార్తె బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. బొత్స వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన గ్రౌండ్‌ వర్క్ పెద్ద ఎత్తున‌ జరుగుతోందని తెలుస్తోంది. ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యక్రమాల్లో అనూష  చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె పొలిటికల్‌గా యాక్టివ్‌ అవుతున్నారనడానికి ఇదే సంకేతమని అంటున్నారు   రాజ‌కీయ విశ్లేష‌కులు. వివిధ కార్యక్రమాల పేరిట బొత్స  అనూష‌ ప్రజల్లోకి వెళ్తున్న తీరు, అందర్నీ కలుపుకుని పోయేందుకు చూపిస్తున్న చొరవ చూస్తుంటే అతి త్వ‌ర‌లోనే  ఆమె రాజ‌కీయ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నది.  చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయంగా అనూష ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని సొంత కేడరే చెబుతోంది. వృత్తి పరంగా డాక్టర్‌ అయిన అనూష… ఇటీవల సెగ్మెంట్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, కేడర్‌ మీటింగ్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల్లో డైరెక్టర్ గావున్న అనూష ప్రజల్లోకి వెళ్ళి వారికి కావల్సిన వైద్య సలహాలను అందిస్తున్నారు. అలాగే గుర్ల, మెరకముడిదాం మండలాల్లో అయితే… స్థానిక‌ నాయకులు ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడికి వెళ్లి త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నార‌ట‌. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండిటిలో ఏదో ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దాని ద్వారా ముందు జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పొలిటికల్‌ కెరీర్‌ మొదలు పెట్టాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.  తల్లి ఝాన్సీ తరహాలోనే అనూష కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తారని బొత్స అనుచరగణం చెప్పుకుంటోంది. మరో వైపు ఇటీవలి కాలంలో అనూష పర్యటనల మీద ప్రజల‌ స్పందన గురించి కూడా ఆరా తీశారట బొత్స సత్యనారాయణ. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో… ఇప్పుడు కోరుకుంటున్నట్టు రేపు పరిస్థితులన్నీ అనుకూలించి తాను రాజ్యసభకు వెళితే… చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతల్ని అనూష చూసుకునేలా స్కెచ్ రెడీ చేస్తున్నారట. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నందున అప్పటికి ఎలాగోలా కుమార్తె సెట్‌ అవుతారన్న ఆలోచనలో ఉన్నారట బొత్స. ఓవరాల్‌గా ఆ కుటుంబం నుంచి మ‌రో రాజకీయ వారసత్వం  ఖాయమైపోయిందంటున్నారు ఎమ్మెల్సీ సన్నిహితులు.

గుంతకల్లులో కీలక నేతల వారసత్వ రాజకీయం

  ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరే నియోజకవర్గాలతో  పోలిస్తే ఆ రాజకీయం ఎప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం ఒకే మండలం రెండు మున్సిపాలిటీ లు మాత్రమే ఉండడంతో పెద్దగా రాజకీయ జోక్యాలు ఉండవు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  2014 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచారు.ఇద్దరు కూడ ఎక్కడ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు.  ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తమ వారసులను ఎంట్రీ ఇచ్చేందుకు ఇద్దరు కీలక నేతలు రంగం సిద్ధం చేస్తున్నారట. 2024లో టీడీపీ నుంచి గెలిచినా గుమ్మనూరు జయరాం, వైసీపీ నేత వెంకట్రామిరెడ్డిలు ఇద్దరు ఇదే పనిలో ఉన్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారట నేతలు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో వారసుల ఎంట్రీ త్వరలో జరగనుందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గుత్తి, పామిడి మండలాల్లో ఇంచార్జిగా ఉండటంతో ఈ రెండు చోట్ల తన ఫోకస్ పెంచారు. వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్‌తో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి గుంతకల్లు మొత్తం తన భుజస్కందాలపై వేసుకొని తండ్రికి చేదోడు వాదుడుగా ఉంటూ వస్తున్నారు.  అయితే తండ్రి ఇటీవల అనార్యోగానికి గురవడంతో తనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ, రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా లాంటి పెద్ద కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి విజయవంతం చేయడంతో ఆమెపై వైసీపీ క్యాడర్‌లో కాన్ఫిడెన్స్ పెరిగిందట. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు నేత పెళ్లికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైరుతి రెడ్డితో  ప్రత్యేకంగా మాట్లాడడం ఈ ఊహాగానాలకు మరింత  బలం చేకూర్చింది.  అందులోనూ వైసీపీలో వేరే నేత ఎవరు పోటీలో లేకపోవడంతో  అయితే వెంకట్రామిరెడ్డి లేదంటే ఆయన కూతురు నైరుతి రెడ్డికి  ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు.ఇక టీడీపీలో చూసుకుంటే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అంత ఈజీగా ఛాన్స్ కొట్టేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఫోకస్ మొత్తం కర్నూల్ జిల్లాలోని సొంత సెగ్మెంట్ ఆలూరుపై పెట్టడం.. అందులోనూ గుంతకల్లు  టీడీపీ లో గుమ్మనూరు జయరాం ఇమడకపోవడం, అవినీతి ఆరోపణలు వస్తుండడంతో పార్టీ అతనికి పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు.  అందులోనూ టీడీపీలో ఈసారి గుంతకల్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఇదే సీట్‌పై కన్నేయడం, టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కూడా గుంతకల్లుపై ఫోకస్ పెంచడం, ఆయనకు అది సొంత నియోజకవర్గం కూడా కావడంతో గుమ్మనూరు ఈశ్వర్‌కు కొద్దిపాటి ఛాన్స్‌లు మాత్రమే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి మరి వారసుల ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి.

డల్లాస్ లో కొడాలి నాని గురించి లోకేష్ ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారాలోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.   ఆరు రోజుల అమెరికా పర్యటనలో  లోకేష్ లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణే. అందులో భాగంగానే ప్రస్తుతం డల్లాస్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ డల్లాస్ లో తెలుగు కమ్యూనిటీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ ఆర్ఐలు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఎంత అండగా నిలిచారో వివరించారు. రాష్ట్రం నంబర్ వన్ గా ఎదగడంలో ఎన్ఆర్ఐల సహకారం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక ఎన్ఆర్ఐ కొడాలి నాని గురించి అడిగారు. అధికారం అండ చూసుకుని అరాచకత్వంతో రెచ్చిపోయిన కొడాలి నానిపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.   అంధ్రప్రదేశ్ ను నంబర్ వన్ గా నిలబెట్టేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలి, అందరూ దానిపైనే దృష్టి పెట్టాలి అని చెప్పిన ఆయన అనవసర విషయాల ప్రస్తావన ఎందుకంటూ వ్యాఖ్యానించారు.  

విజయసాయి కాషాయ మంత్రం..జగన్ కు కషాయం!

రాజకీయాలకు అలవాటు పడిన నాయకులు వాటిని వదులు కోవడానికి ఇష్టపడరు.  ఏదో ఆవేశంలో రాజకీయ వైరాగ్యం కలిగినా, మరీ ఆవేశపడి రాజకీయ సన్యాసం తీసుకున్నానంటూ ప్రకటనలు చేసేసినా.. ఆ ఆవేశం తగ్గాకా మళ్లీ వాళ్ల చూపు రాజకీయలవైపే అంటుంది. అడుగులు కూడా రాజకీయం వైపే పడతాయి. ఒక లగడపాటి రాజగోపాల్ అయినా, మరో ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా.. ఇంకో వడ్డే శోభనాదీశ్వరరావైనా అంతే. అవకాశం లేక, జనం మొచ్చక, ఒప్పక వీరంతా రాజకీయ ప్రకటనలకే పరిమితమయ్యారు. అయితే విజయసాయిరెడ్డి పరిస్థితి అది కాదు.విజయసాయి  అవేశంతో కంటే ఎంతో  ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.  ఎందుకంటే.. వైసీపీలో ఒక సమయంలో ఆయన జగన్ తరువాత జగనంతటి నాయకుడిగా వెలుగొందారు.  ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించిన సమయంలో రాజకీయంగానే కాదు, కేసుల పరంగా కూడా నిండా మునిగి ఉన్నారు. ఇంత కాలం తన సర్వస్వం ధారపోసి పెంచిన పార్టీ దూరం పెట్టింది. అదే సమయంలో కేసులూ చుట్టుముట్టాయి. ఆ కేసుల నుంచి బయటపడాలంటే.. వైసీపీకి తాను దూరం అని నిరూపించుకోవాలి. అదే సమయంలో.. తన స్వేదంతో పెంచిన పార్టీలో.. తన ఉనికినే ప్రశ్నార్థకం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అవకాశం రావాలంటే.. పోలిటికల్ గా తాను న్యూట్రల్ గా ఉన్నాననీ, ఉంటాననీ నిరూపించుకోవాలి. అందుకే ఆ సమయంలో విజయసాయి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లుగా ప్రకటించారని పరిశీలకులు విశ్లేషించారు. వారి విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన వ్యవసాయమే వ్యాపకం అని ప్రకటించినా, సోషల్ మీడియా ద్వారా, చేయగలిగినంత రాజకీయం చేశారు. అలాగే కేసుల విచారణకు హాజరైన సందర్భంగా మీడియా ముందూ రాజకీయాలే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు ఆయన ఇచ్చిన లీకులే కారణమంటే అతిశయోక్తి కాదు. విజయసాయి వైసీపీ నుంచి బయటకు వచ్చి, రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మాటలు, చేతలు, అడుగులూ అన్నీ బయటకు జగన్ కోటరీ టార్గెట్ అన్నట్లు కనిపించినా.. ఆయన అసలు లక్ష్యం జగన్ అన్నట్లుగానే సాగాయి. అంతెందుకు విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత హైదరాబాద్ వెళ్లి మరీ  జగన్ సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. ఆ తరువాత కూడా విజయసాయి పొలిటికల్ గా బీజేపీకి చేరువ అవుతున్నారన్న ప్రచారం జరిగింది.   ఇప్పుడు ఆ ప్రచారాలకీ, ఆ విశ్లేషణలకూ బలం చేకూర్చే విధంగా హిందుత్వకు మద్దతుగా ఆయన తన గళం వినిపించారు. అదీ అలా ఇలా కాదు.. వైసీపీ పునాదులే కదిలిపోయేంత గట్టిగా విజయసాయి బాం బు పేల్చారు. మొత్తంగా గత రెండు దశాబ్దాలుగా  జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలనీ, ఇందుకు ఒక కమిటీని వేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. హిందుత్వకు ద్రోహం చేసిన వారిని ఎవరినీ విడిచిపెట్టకూడదని ఉద్ఘాటించారు. ఈ మాటల వెనుక ఆయన ఆయన ప్రధాన టార్గెట్ వైసీపీ అండ్ జగన్ అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుందంటారు పరిశీలకులు. గత రెండు దశాబ్దాలుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలన్నది ఆయన చేసిన డిమాండ్.   వైఎస్ జమానాలో క్రైస్తవ మతంలోకి పెద్ద ఎత్తున మతమార్పిడులు జరగిన విషయం అందరికీ తెలి సిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి డిమాండ్  ద్వారా బీజేపీకి పదునైన ఆయుధాన్ని అందించారని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు విజయసాయి ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోవచ్చు కానీ, బీజేపీ గొంతుక వినిపించారు.  తద్వారా తన అడుగులు ఎటు అన్న సంకేతాలు ఇచ్చారు. విజయసాయి కాషాయం పుచ్చుకుంటే.. జగన్ కు ఇక గడ్డుకాలమేనన్నది పరిశీలకుల విశ్లేషణ

కారు పార్టీ పోయి...హస్తం పార్టీ వచ్చిన దోపిడీ ఆగలేదు : కిషన్‌రెడ్డి

  కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్‌ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌ విడుదల చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణలో కారు పార్టీ పోయి హస్తం పార్టీ దోపిడీ మాత్రం ఆగలేదని ఆయన అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లయినా 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయలంటే భూములు అమ్మవలసి వస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్నం, ఉచిత బస్సు పథకాలను మాత్రమే ప్రచారం చేసుకుంటుందని, అందులో సన్నం బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటనే ఎక్కువ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయోత్సవాలు జరుపుకునే హక్కు ఎక్కడిదని ఎంపీ డీకే అరుణ అన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4 వేలు ఏవి? రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఎంత కేటాయించారని చెప్పాలని ప్రశ్నించారు  గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల హాయంలో తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల రాజ్యం కొనసగుతోందని కిషన్ రెడ్డి  తెలిపారు. ఈ మహాధర్నలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణం : సీపీఐ

బీజేపి రాజ్యాంగంలో లౌకిక, సొషలిష్ట అనే పదాలు 400 ఎంపీ సీట్ల ఇస్తే తొలగిస్తామనడం దారుణమన్ని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచిపోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నరన్నారు.  అలగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉన్నదాని 90 రూపాయల 30 పైసులు పడిపొవడాని నిర్మాల సీతారామన్న మంచిదే అన్నడం చాలా దారుణమన్నారు. దిని వల్ల ప్రజలు, రైతులు నష్టపోతారన్నారు. అలగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటికరణ చేసి చాల అన్యాయం చెస్తుందన్నారు. రాజ్యధాని పేరుతో మల్లి ల్యాండ పుల్లింగుకు పాల్పడుతుందన్నారు. డబ్బులంతా అమరావతిపై పెట్టి మల్లి ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారన్నారు.

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్

  మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో మ‌రో కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ ఛైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ మద్యం కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు కూడా మాయమవడం కలకలం రేపుతోంది. 2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి నకిలీ మద్యం తెప్పించి, లేబుళ్లు మార్చి ఓటర్లకు పంపిణీ చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.  ఆనాడు ఈ నకిలీ మద్యం తాగి పలువురు మరణించగా, వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు.ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఫైళ్లు 2018లోనే అదృశ్యమైనట్లు విజయవాడ ప్రత్యేక కోర్టు గుర్తించి, కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి  ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తనపై కేసు నమోదు కావడంతో కాకాణి తీవ్రంగా స్పందించారు. దేవాలయ భూములు అక్రమాలపై ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డికి దమ్ముంటే నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సిద్దమా అని సవాల్ విసిరారు.

వింటర్ లో హాట్ హాట్ గా మద్యం సేల్స్! నాలుగు రోజుల్లో రూ.600 కోట్లు!

తెలంగాణలో మద్యం విక్రయాలు అమాంతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో మందుబాబులు గజగజలాడించే చలి నుంచి రక్షణ కోసం చలిమంటలు, దుప్పట్లు, రగ్గులను కాకుండా మద్యాన్ని ఆశ్రయించారని భావించాల్సి వస్తోంది. ఎందుకంటేచలి పెరగడంతో గత నాలుగు రోజులలో  రాష్ట్రంలో  ఏకంగా 600 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే ఈ అమ్మకాలు 5 కోట్ల 86 లక్షలుగా ఉన్నాయి.  వెచ్చటి మద్యం గొంతులో పోసుకుని చలిలో  తెలంగాణ మందుబాబులు ఖుషీ చేస్తున్నారని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పొలిస్తే  మద్యం విక్రయాలు ఈ ఏడు ఏకంగా 107 శాతం పెరిగాయి.  రాష్ట్రం మొత్తంగా చూస్తే ఈ నెల మొదటి తారీకు నుంచి నాలుగో తేదీ వరకూ అంటే డిసెంబర్ 1 నుంచి 4 వరకూ కేవలం నాలుగు రోజుల్లో 600 కోట్లు ఉండటానికి  గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త మద్యం విధానం కూడా కారణమని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.  నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో  5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వడమే ఇందుకు నిదర్శనం. అదే గత ఏడాది ఇదే కాలంలో  బీర్ల అమ్మకాలు 4.26 లక్షల కేసులు మాత్రమే. 

ఏపీ గ్రోత్ రేట్@10.5%

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటోంది.  ఈ ఏడాది ఏపీ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. వైసీపీ హయాంలో ఏపీ ప్రగతి తిరోగమనంలో సాగిన సంగతి తెలిసిందే.  అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత  దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26  ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.   దేశవ్యాప్తంగా సగటు వృద్ధి 8.8 శాతం ఉంటే, ఒక్క అంధ్రప్రదేశ్ మాత్రం జాతీయ సగటును మించిన వృద్ధి రేటు సాధించింది. ఈ వేగం ఇలాగే సాగితే  ఈ ఏడాది మొత్తం రాష్ట్ర ఆదాయం సుమారు 18 లక్షల 65 వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ అభివృద్ధిలో సింహ భాగం వ్యవసాయానిదే అని చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ ఉత్పత్తులు 9.6 శాతం పెరిగి 81 వేల 496 కోట్ల రూపాయలకు చేరాయి. గత ఏడాది ఈ వృద్ధి 36 శాతంగా ఉంది. అలాగే సేవల రంగం 8.5 శాతం, పరిశ్రమలు 23 శాతం  పెరిగాయి. ఈ మూడు రంగాలూ ఒకేసారి బలపడటం వల్లనే  ఆర్థిక వ్యవస్థ పునాది గట్టిపడిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047    ప్రకారం 2047 నాటికి రాష్ట్ర ఆదాయం 2.4 లక్షల కోట్ల డాలర్లకు , తలసరి ఆదాయం 35 లక్షల రూపాయలు చేరాలి. ఆ దీర్ఘకాలిక లక్ష్యం దిశగా తొలి అడుగు పడిందనే తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.  పథకాల అమలులో వేగం,  అధికారుల చొరవ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ అన్నీ కూడా ఏపీ ప్రగతికి, పురోగతికి, ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తున్నాయని చెప్పాలి.    సముద్ర ఆహార ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రాకు 38 శాతం వాటా ఉంది, దాదాపు 7.74 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 28 వేల 409 మెగావాట్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల్లో డబ్బు లభ్యత పెంచడం వల్ల ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగింది. జగన్ హయాంలో కుదేలైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు హయాంలో ఇప్పుడు కోలుకుని వేగంగా ముందుకు సాగుతోంది.