- సంత్రా, టమాట రసాన్ని సమపాళ్ళల్లో కలిపి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత కడిగేయండి. ఇలా రోజు చేస్తే ముఖం పై ఉన్న మొటిమలు, నల్లమచ్చలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది.

- పుదీనా ఆకులను మెత్తగా ఫెస్ట్‌లా చేసుకొని ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు మాయమైపోతాయి.

- ఎండబెట్టిన సంత్రా పండు యొక్క తొక్కలు, ఎల్లిపాయలకు సరిపడా నీళ్లు కలుపుతూ పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించండి.

- దోసకాయను తీసుకొని దానికి ఓట్‌మిల్, మూడు టీస్పూన్స్ తేనేను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దానిని ముఖానికి మాస్క్‌లా అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత కడిగేస్తే మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది.

- రోజ్‌వాటర్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి ముఖంపై అప్లై చేయాలి. 15-30 నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి.