హెయిర్ డై ఎడా పెడా వాడేస్తున్నారా..అయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం.! ప్రతి ఒక్కరూ వాటిని పూర్తి చేసి తమ జుట్టుకు కొత్త రూపాన్ని తేవాలని తాపత్రయం పడుతుంటారు. ఇందుకోసం హెయిర్ స్ట్రెయిటెనింగ్, హెయిర్ కలరింగ్, హెయిర్ స్మూత్ చేయించుకోవడం కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. అయితే  కానీ, FDA (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఇటీవలే బాంబు పేల్చింది.  ఫార్మల్డిహైడ్ రసాయనం ఉన్నటువంటి హెయిర్ ఉత్పత్తుల వాడకాన్ని నిశేధించింది.   స్ట్రెయిటెనింగ్, కలరింగ్, హెయిర్ స్మూత్ చేయడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయా..? జుట్టును సిల్కీగా, మృదువుగా మార్చే ఉత్పత్తులలో ఉపయోగించే రసాయనాల వల్ల  భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ కలరింగ్ లో వాడే రసాయనాల వల్ల కళ్ళు, ముక్కు, గొంతులో చికాకు కలిగిస్తుందని. ఇది శ్వాసకోశ సమస్యలను కూడా కలిగిస్తుందని  భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు కూడా పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం: జుట్టు ఉత్పత్తులు గర్భాశయం లేదా అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది.  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్ రికార్డ్) 2022 అధ్యయనం నుండి అనేక సూచనలు ఉన్నాయి. హెయిర్ ఉత్పత్తుల్లో వాడే ఫార్మాల్డిహైడ్  క్యాన్సర్ కణాలను ప్రేరేపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ డై వల్ల బ్లాడర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం: తాజాగా వచ్చిన ఒక పరిశోధనలో హెయిర్ డై మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని సూచిస్తుంది.  దాదాపు 80% హెయిర్ డై ఉత్పత్తులు హైడ్రోజన్ పెరాక్సైడ్ నుండి తయారవుతాయి. ఇవి క్యాన్సర్ కారకాలు కావచ్చు. ఇవి మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది: ఇక హెయిర్ స్ట్రెయిట్‌నర్‌లు లేదా రిలాక్సర్‌లు రొమ్ము, అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కార్సినోజెనిక్ ఏజెంట్‌లను కలిగి ఉంటాయని ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్, మిథిలిన్ గ్లైకాల్ వంటి సమ్మేళనాలు. దీనికి కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సూచన ఇదే: సహజ సిద్ధమైన హెన్నా వంటి జుట్టు ఉత్పత్తులను గుర్తించి వాటిని మాత్రమే ఉపయోగించడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.  

మహిళలలో మెనోపాజ్ సమయంలో వచ్చే నిద్రలేమికి భలే పరిష్కారాలు.! ఆడవారి జీవితంలో ప్రతి దశలోనూ చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. 10 నుండి 15 ఏళ్ల మద్య మొదలయ్యే ఋతుచక్రం 40ఏళ్లు వచ్చేవరకు ఉంటుంది. ఆ తరువాత ఋతుచక్రం ఆగిపోతుంది. అన్నేళ్లు శరీరంలో క్రమానుసారంగా సాగిన ఈ ప్రక్రియ ముగిసిపోవడం కారణంగా మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యలలో నిద్రలేమి ప్రధానంగా ఉంటుంది. సరిగా నిద్రలేకపోవడం, కలత నిద్ర, తలనొప్పి, శరీరంలో అసౌకర్యంగా అనిపించడం, హార్మోన్ సమస్యల కారణంగా నిద్ర సమస్యలు వస్తాయి. దీన్ని పరిష్కరించడానికి ఈ కింది చిట్కాలు సహాయపడతాయి. మెగ్నీషియం.. శరీరంలో స్కిరాడియన్ సైకిల్ లేదా సహజ గడియారం నియంత్రణ కోల్పోయినప్పుడు కండరాల కదలిక ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిష్కరించడానికి మెగ్నీషియం సహాయపడుతుంది. మెగ్నీషీయం తీసుకోవడం ద్వారా కండరాలు సడలించబడతాయి, నిద్ర గడియారం కంట్రోల్ లోకి వస్తుంది. నిద్ర బాగా పడుతుంది. అల్లం, జీడిపప్పు, బాదం, నువ్వులలో మెగ్నీషియం బాగుంటుంది. విటమిన్-ఇ మెనోపాజ్ సమయంలో శరీరంలో వేడి ఆవిర్లు పుడుతుంటాయి. రాత్రి సమయంలో చెమటలు కూడా పడతాయి.  విటమిన్-ఇ  శరీరానికి లభించేలా చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, కొబ్బరి, అవిసె గింజలు, పిస్తాపప్పులలో విటమిన్-ఎ సులభంగా దొరుకుతుంది. ఒమెగా-3 ఒమెగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు మానసిక కల్లోలాన్ని, నిద్రలేమి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి.  చేపలు, సజ్జలు, బార్లీ, మొక్కజొన్న, రాగులు  మొదలైన వాటిలో ఒమెగా-3 లభ్యమవుతుంది. సోయా ఉత్పత్తులలో ఐసోప్లేవోన్ లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ ను అనుసరిస్తాయి. శరీరంలో వేడి ఆవిర్లు తగ్గించడం, ఋతుక్రమం ఆగిపోయినప్పుడు కనిపించే లక్షణాలను నియంత్రించడంలో సహాయపడతాయి. అందువల్ల సోయా ఉత్పత్తులు వాడితే నిద్ర నాణ్యత బాగుంటుంది.                                        *నిశ్శబ్ద.

గర్బినీ మహిళలు ఉసిరికాయ రసం తాగవచ్చా! గర్భధారణ సమయం మహిళల జీవితంలో చాలా సున్నితమైన దశ. ఈ సమయంలో తీసుకునే ఆహారం, పానీయం గర్బవతులకే కాకుండా  కడుపులో పెరిగే బిడ్డల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చలికాలం గడుస్తోంది. ఈ చలికాలంలో విరివిగా దొరికే ఉసిరికాయలు గొప్ప రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఉసిరికాయలు తిన్నా, దాని జ్యూస్ తాగినా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే గర్బవతులు ఉసిరికాయ రసాన్ని రోజూ తీసుకోవచ్చా? ఇది వారి ఆరోగ్యానికి మంచిదేనా అనే విషయం తెలుసుకుంటే.. గర్భవతులు ఉసిరికాయ రసాన్నితీసుకోవచ్చు. దీనివల్ల గర్భవతులలో ఎదురయ్యే కడుపులో వికారం, వాంతులు వంటి సమస్యలు  అదుపులో ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఉసిరికాయలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. పొటాషియం, డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఉసిరికాయ రసాన్ని ప్రతిరోజూ తీసుకుంటే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలే పొందవచ్చు. అయితే తాజా  ఉసిరి రసం దొరకకపోతే మార్కెట్లో దొరికే ఉసిరికాయ రసాన్ని కూడా వాడచ్చు. కానీ ఈ రసాలు ప్రభుత్వ అమోదం, ఫుడ్ కమీషన్ వారి ఆమోదం పొందినవి అయి ఉండాలి. ప్యాకేజింగ్, నిల్వ కూడా పక్కాగా ఉండాలి. ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే మరొక ప్రయోజనం.. NCBI పరిశోధన ప్రకారం, ఉసిరిని తీసుకోవడం ద్వారా అనేక రకాల వాస్కులర్ డిజార్డర్‌లను నివారించవచ్చు. ఉసిరిలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంతో పాటు మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది HDL కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుంది మరియు LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఉసిరికాయను ఎలా తీసుకోవాలి?  గర్భవతులు ఉసిరిని తీసుకోవాలని అనుకుంటే వాటిని తాజాగా,  పచ్చిగా తినడం మేలు. నవంబర్ నుండి ఫిబ్రవరి నెలల మధ్యలలో ఉసిరికాయ తినడం మంచిది. మురబ్బా, జామ్, ఊరగాయ, బర్ఫీ ,  పొడితో పాటు, సంవత్సరం పొడవునా లభించే ఉసిరి నుండి రసం కూడా తయారు చేస్తారు.  వీటిని పరిమిత పరిమాణంలో కూడా తీసుకోవచ్చు.  ఎందుకంటే ప్యాక్ చేసిన ఆహారం తాజా ఆహారం కంటే తక్కువ పోషకాహారాన్ని కలిగి ఉంటుంది. ఇంట్లోనే ఉసిరికాయ జ్యూస్.. ఉసిరికాయ జ్యూస్ తాగాలని  ఉంటే ఇంట్లోనే తయారుచేసుకుని ఫ్రెష్ గా తాగితే బాగుంటుంది. ప్యాక్ చేయబడిన జ్యూస్‌లలో సాధారణంగా ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రుచులు ఉంటాయి. ప్యాక్ చేసిన ఉసిరి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. కొనుగోలు చేయడానికి ముందు జ్యూస్ ప్యాకెట్ సీలు చేయబడిందో లేదో తనిఖీ చేయాలి.   దాని గడువు తేదీని కూడా చెక్ చేసుకోవాలి.  గర్భధారణ సమయంలో మధుమేహం అటాక్ అయినట్టయితే తప్పనిసరిగా వైద్యుల సలహాతోనే దీన్ని వాడాలి.  జ్యూస్ తాగే ముందు అందులో కొంచెం నీరు కలపాలి. ఎందుకంటే ఉసిరికాయ జ్యూస్ ఎక్కువ ఆమ్లగుణం కలిగి ఉంటుంది. దీన్ని అలాగే తాగితే గొంతులో చికాకు, అసౌకర్యం కలుగుతుంది. అదే నీళ్లలలో కలుపుకుంటే ఆమ్లగుణం సర్దుకుంటుంది.  (నోట్: ఇది ఆహారనిపుణలు, వైద్యులు  పలు సందర్బాలలో చెప్పిన విషయాల ఆధారంగా ఇచ్చిన సమాచారం.  గర్భవతులు తమ ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహా మేరకే ఆహారం, మందులు తీసుకోవాల్సి ఉంటుంది.)                                                 *నిశ్శబ్ద.  

పీరియడ్స్ నొప్పికి మహిళలు వాడే ఈ టాబ్లెట్ ఎంత డేంజరో తెలుసా? దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలను అయినా ఒకటి రెండు రోజులు భరించగలరు చాలామంది. కానీ నొప్పులను మాత్రం అస్సలు భరించలేరు. దీనికి కారణం ఏ పని చేయాలన్నా శరీరంలో వివిధ అవయవాలు, భాగాలు నొప్పితో సహకరించకపోవడమే. అందుకే నొప్పులు రాగానే మొదట టాబ్లెట్స్ తెచ్చుకుని వేసుకుంటారు. ఇలాంటి నొప్పి మాత్రలలో మెప్టాల్ కూడా ఒకటి. ఇది సాధారణ నొప్పులకే కాకుండా పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎదురయ్యే సమస్యలను కూడా తగ్గిస్తుంది. సాధారణంగా నొప్పుల మాత్రలు 15నిమిషాలలోనే వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే మెప్టాల్ కు సంబంధించి సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మాత్ర ఉపయోగించడం తగ్గించమని చెప్పింది. అసలు ఈ మాత్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం, వైద్యులు ఏం చెబుతున్నారు? ఇది వాడటం ప్రమాదం ఎందుకు? పూర్తీగా తెలుసుకుంటే.. అసలు సమస్య ఇదీ.. అసలు సమస్య ఏంటంటే.. ఎలాంటి ఆందోళన లేకుండా ఈ పెయిన్ కిల్లర్ వాడుతున్నారు.  ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అయినప్పటికీ, పీరియడ్స్ లో వచ్చే కడుపునొప్పి, కండరాల తిమ్మిర్లు, తలనొప్పి, కండరాలు,  కీళ్ల నొప్పులు,  అధిక జ్వరం నుండి ఉపశమనం పొందడానికి ఫెనామిక్ యాసిడ్ భారతదేశంలో సర్వసాధారణంగా ఉపయోగించబడుతుంది. ఇది Meftal, Mefkind, Mefnorm,  Ibuklin P పేర్లతో విక్రయించబడుతోంది. డ్రగ్ సిండ్రోమ్.. మెప్టాల్ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల చాలామందిలో డ్రగ్ సిండ్రోమ్ ఎదువుతుంది. డ్రగ్ సిండ్రోమ్ అనేది మందులు తీసుకున్న తరువాత దాదాపు 10శాతం మందిని ప్రభావితం చేస్తుంది. దీంట్లో ఇసినోపిలియా, శారీరక  లక్షణాలు కూడా ఉంటాయి. జ్వరం, చర్మం పై  దద్దుర్లు, లెంఫాడెనోపతి, హెమటోలాజికల్ వంటి అసాధారణ లక్షణాలు మందులు తీసుకున్న రెండు నుండి ఎనిమిది వారాల తరువాత కనిపించడం ప్రారంభిస్తాయి. దీనికి పరిష్కారం కంటే సమస్య రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమం. ఈ మందుల వినియోగానికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఆప్షన్స్.. మెఫెనామిక్ యాసిడ్ మందులపై ఒక హెచ్చరిక కూడా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శోరరస కణువులలో వాపు పెరుగుతుంది. మెఫెనామిక్ యాసిడ్ మందులు ఎవరైనా ఉపయోగిస్తంటే వాటికి ప్రత్యామ్నాయ మందుల గురించి ఆలోచించాలి. మెప్టాల్ మందులు ఎక్కువ కాలం తీసుకుంటే అవి కడుపులో అల్సర్, రక్తప్రసరణ, పొట్టకు సంబంధించిన సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారు ఈ మందులకు ప్రత్యామ్నాయం గురించి వైద్యులను అడిగి తెలుసుకుని  వేరే మందులు ఉపయోగించాలి. అసలు సమస్యలివీ.. మెఫ్టాల్ మాత్రలు హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ మందుల వల్ల హృదయ సంబంధ సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు మెప్టాల్ ను వినియోగించకపోవడమే మంచిది. ఇది కిడ్నీ సమస్యలను కూడా పెంచుతుంది.                                                      *నిశ్శబ్ద.   

చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. గర్బిణుల్లో ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడుగా జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, పొడి చర్మం వంటిసమస్యలు పెను సవాళ్లుగా మారుతుంటాయి. సాధారణంగానే రోగనిరోధోకశక్తి తక్కువగా ఉంటే గర్భిణులకు చలికాలం గడ్డుకాలమే. అలాని పెద్దగా భయపడాల్సిన అవసరంలేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో గర్భిణీలు ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఎక్కువ నీళ్లు తాగాలి: వాతావరణం చల్లగా ఉంటే అస్సలు దాహం వేయదు. అలాని నీళ్లు తాగకుండా ఉంటే డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం ఉంటుంది. గర్భిణులు ఈ విషయం మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే శరీరంలో నీటిస్థాయి లేనట్లయితే ఉమ్మనీరు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఇది ఇలానే కొనసాగితే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టె అవకాశం ఉంటుంది. కాబట్టి కాలమేదైనా వైద్యుల సలహా మేరకు తగిన మోతాదులో నీళ్లు తాగడం మంచిది. కొబ్బరి నీళ్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది. కీళ్లనొప్పులు: చలికాలంలో చాలామందిని వేధించే సమస్యల్లో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. చల్లగాలులకు శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోయి రక్తప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో కండరాలు, కీళ్లు బిగుసుకుపోతాయి. అంతేకాదు గుండెకూ రక్తం సరఫరా కాదు. గర్బిణుల్లో ఇలాంటి సమస్యలు ఉంటే అది కడుపులో ఎదిగే బిడ్డకు కూడా ప్రమాదమే. కాబట్టి ఇలాంటి సమస్యలెదుర్కొనే గర్భిణులు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం అరోమా థెరపీ చక్కగా ఉపయోగపడుతుంది. ఈక్రమంలో లావెండర్, టీట్రీ, యూకలిప్టస్ వంటి నూనెలతో శరీరమంతా మసాజ్ చేసుకోవడం రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీంతో శారీరక నొప్పులు తగ్గడమే కాదు..ఆరోగ్యమూ కూడా ఇనుమడిస్తుంది. ఈ చిట్కాతో పొడిచర్మం సమస్య కూడా చాలా తగ్గుతుంది. అయితే ఇవి సహజసిద్ధమైన నూనెలే అయినప్పటికీ గర్బిణులు వీటిని వాడే విషయంలో ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. చర్మ సంరక్షణ: చలికాలమంటే చాలా మంది భయపడుతుంటారు. కారణం చర్మం పొడిబారుతుంది. దీంతో దురద, మంటతో ఇబ్బంది పడుతుంటారు. గర్భిణీల్లో పొట్ట పెరిగిన కొద్దీ చర్మం సాగుతుంది. దీంతో మరింత దురద పుడుతుంది. దీన్ని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే స్ట్రెచ్ మార్క్స్ తో తిప్పలు తప్పవు. అందుకే డాక్టర్ సలహా మేరకు క్రీములు, లోషన్లు, నూనెలు కూడా వాడవచ్చు. వాటితో రోజుకు ఒకటి లేదా రెండు సార్లు పొట్ట భాగంలో మర్దన చేసుకుంటే అటు రక్తప్రసరణ మెరుగవుతుంది. ప్రసవానంతరం స్ట్రెచ్ మార్క్స్ రాకుండా కూడా ఈ చిట్కా సహాయపడుతుంది. మిగతా భాగాల్లో చర్మ సంరక్షణ కోసం పొడి జుట్టు నుంచి విముక్తి పొందడం కోసం నిపుణుల సలహా మేరక సంబంధిత సౌందర్య ఉత్పత్తులు వాడటం మంచిది. లేదంటే ఇంట్లోనే తయారు చేసుకున్న సహాజ సిద్ధమైన బ్యూటీ ఉత్పత్తులు కూడా వాడవచ్చు. ఉదయం నుంచి ఉత్సాహంగా ఉండేందుకు: చలికాలంలో ఉదయాన్నే లేవాలంటే బద్ధకంగా ఉంటుంది. దీనికి తోడు గర్భం ధరించిన 3 లేదా 4నెలల పాటు వేవిళ్ల సమస్య వేధిస్తుంది. ఫలితంగా శరీరం మరింత నీరసించిపోయే ప్రమాదం కూడా ఉంది. తద్వారా కడుపులో పెరుగుతన్న బిడ్డపైన కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం నుంచి ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం, ధ్యానం, యోగా వంటివి రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాలి. వీటివల్ల శరీరం ఉత్తేజితమవడంతో పాటు మనసకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గర్భం ధరించిన సమయంలో ఎలాంటి వ్యాయామాలు చేయాలన్న విషయం గురించి మీరు సొంత నిర్ణయం తీసుకోకుండా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.  

గర్భధారణ సమయంలో మహిళలు తప్పకుండా తాగాల్సిన డ్రింక్స్ ఇవే!    మహిళలు గర్భం దాల్చడం అనేది ప్రత్యేక వరం.  ఆ సమయంలో  చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆహారం నుండి విహారం వరకు గర్బవతుల చిట్టా ప్రత్యేకం. ముఖ్యంగా చలికాలంలో గర్భవతులు ఆరోగ్యం  విషయంలో కేర్ తీసుకోవాలి. వాతావరణ మార్పుల కారణంగా అనారోగ్యాలు ఎదురుకాకుండా, ఒకవేళ ఎదురైనా సరే అవి గర్భవతులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆహారం కూడా ముఖ్యమే.  ఈ కింద చెప్పుకునే డ్రింక్స్ గర్భవతులకు చలికాలంలో చాలా మేలు చేస్తాయి. వేడినీటితో నిమ్మరసం.. వేడినీటిలో కాసింత నిమ్మరసం కలిపి తీసుకోవడం చాలామంది చేస్తుంటారు. అయితే ఇది గర్భవతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇమ్యునిటీ పెంచడంలో సహాయపడుతుంది. సీజనల్ సమస్యలు రాకుండా చేస్తుంది. పుట్టబిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం మంచిది. అల్లం పాలు.. అల్లం గొప్ప  ఔషద గుణాలు కలిగి ఉంటుంది. అల్లాన్ని పాలలో వేసి బాగా ఉడికించి దీన్ని గోరువెచ్చగా ఉన్నట్టే తాగాలి. గర్భవతులు అల్లం పాలు తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో వాంతుల సమస్య  తగ్గుతుంది. అలాగే ఉదర సంబంధిత సమస్యలు అంటే.. అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపులో వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. వేడి పాలు.. వేడిపాలు పోషకాన్ని మాత్రమే కాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. క్రమం తప్పకుండా వేడిపాలు తాగడం వల్ల  పదే పదే అనారోగ్యానికి గురయ్యే సమస్య తగ్గుతుంది. చికెన్-ఆనియన్ సూప్.. గర్భవతులు మాంసాహారులైతే వైద్యుల సలహా మీదట చికెన్-ఆనియన్ సూప్ తీసుకోవాలి. ఇది తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కండరాలు బలపడతాయి. కండరాలు బలంగా ఉంటే మహిళలకు గర్భాన్ని మోయడంలో ఇబ్బంది ఉండదు.                                        *నిశ్శబ్ద. (మనిక: గర్భవతుల ఆహారానికి సంబంధించి పోషకాహార నిపుణులు, వైద్యులు పలు వేదికలల్లో పేర్కొన్న విషయాల ఆధారంగా ఈ సమాచారం అందించబడింది. గర్భవతులు ఆహారం విషయంలో తమ వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవడం మంచిది)

మహిళలు బలంగా ఉండాలంటే ఈ ఆహారాలు తినాలి!! ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు, వైద్యులు కూడా. మహిళలు చాలావరకు మానసికంగా బలంగానే ఉంటారు. కానీ శారీరకంగా బలంగా ఉండే మహిళలు చాలా తక్కువ. ముఖ్యంగా నేటి కాలంలో మహిళలు అయితే చాలా సున్నితం ఉంటారు. పెళ్లై, ఓ ఇద్దరు పిల్లల్ని కంటే ఇక చాలా బలహీనం అయిపోతారు. కానీ ఈ బలహీనత రాకూడదన్నా,. ఆల్రెడీ వచ్చిన బలహీనతను అధిగమించాలన్నా ఈ కింది ఆహారాలు తప్పక తినాలి. కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు మహిళలకు చాలా అవసరం. మహిళలకు కాలం గడిచేకొద్ది ఎముకలు చాలా తొందరగా బలహీనం అవుతాయి. కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు బాగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు అధిగమించవచ్చు. ఎముక బలం ఉంటే మహిళలు చాలావరకు బలంగా ఉంటారు. పాలు, పెరుగు,  పాల ఉత్పత్తులు, ఫూల్ మఖనా మొదలైన కాల్షియం ఆహారాలు రోజూ తినాలి. మహిళలలో రక్తహీనత సమస్య కూడా ప్రముఖమైనది. దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నెలసరి అస్తవ్యస్తం అవుతుంది. ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు బాగా తీసుకుంటే ఈ సమస్యలు అధిగమించవచ్చు. నువ్వులు, బెల్లం, పల్లీలు, చేపలు, బీన్స్ వంటి ఆహారాలలో ఐరన్ బాగా ఉంటుంది.   గుండె ఆరోగ్యం, నరాల ఆరోగ్యం, జీవక్రియ, రక్తప్రసరణ మొదలైనవాటికి ఫోలేట్ చాలా అవసరం. ఇది లోపిస్తే గర్భదారణ సమయంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. పోలిక్ యాసిడ్ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలు, చిక్కుళ్లు, కమలాపండ్లు, కరివేపాకు, బ్రోకలి, బెండకాయ, గుడ్లు, ఆవు పాలు మొదలైనవాటిలో ఫోలెట్ సమృద్దిగా ఉంటుంది. మహిళలలో రోగనిరోధక శక్తి బాగుండాలంటే విటమిన్-సి బాగా తీసుకోవాలి. ఇది చర్మ ఆరోగ్యాన్నికూడా కాపాడుతుంది. నిమ్మజాతి పండ్లు, సిట్రస్ ఆధారిత కూరగాయలు, స్ట్రాబెర్రీలు మొదలైనవాటిలో విటమిన్-సి లభిస్తుంది. సరైన బరువు ఉంటే సగం ఆరోగ్యంగా ఉన్నట్టే. బరువు బ్యాలెన్స్ గా ఉంచుకోవడానికి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం తప్పనిసరి. గుండె జబ్బులను, మధుమేహాన్ని కూడా పైబర్ దరిచేరనివ్వదు. ఫైబర కోసం తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు బెస్ట్ ఆప్షన్. శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, పాస్పరస్ శరీరానికి అందాలి. ఇవి అందాలంటే విటమిన్-డి ఖచ్చితంగా అవసరం. విటమిన్-డి లోపిస్తే  కాల్షియం, పాస్పరస్ ఉన్న ఆహారాలు తిన్నా సరే ఎముకలు బలంగా మారవు. కాబ్టటి విటమిన్-డి తప్పనిసరిగా అందేలా చూడాలి. సూర్యుడి లేతకిరణాలు శరీరం మీద పడుతున్నప్పుడు ఆ ఎండలో గడపాలి. పుట్టగొడుగులు, చేపలు, పాలు, గుడ్లు బాగా తీసుకోవాలి. మహిళల శరీరంలో కండరాలు బలంగా ఉండాలంటే ప్రోటీన్ బాగా అందాలి. ఇది శరీరంలో కండర కణాల రిపేర్ కు సహాయపడుతుంది. కాయధాన్యాలు, గుడ్లు, చేపలు, పాలు వంటి ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలి. రక్తపోటు అదుపులో ఉండాలంటే పొటాషియం తప్పనిసరి. కండరాలు, నరాలు ఆరోగ్యంగా పనిచేయడానికి కూడా ఇది అవసరం. పాలకూర, బీన్స్, అరటిపండ్లు తీసుకుంటూ ఉంటే పొటాషియం బాగా లభిస్తుంది.                                                            *నిశ్శబ్ద.  

గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాలు తింటే అంతే సంగతులు! ఆడపిల్ల జీవితంలో వివాహం, గర్బం దాల్చడం కీలకమైన మలుపులు. వీటి తరువాత నుండి మహిళల జీవితం చాలా మార్పులకు లోనవుతుంది. పండంటి పాపాయి పుట్టాలంటే మంచి ఆహారం తీసుకోవాలని  వైద్యుల నుండి పెద్దల వరకు చెబుతారు. అయితే ఇప్పటి కాలం అమ్మాయిలు చాలామంది ఉద్యోగాల కారణంగా పెద్దలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరికి అసలు తాము తీసుకునే ఆహారాల మీద స్పష్టతే ఉండదు.  ఈ కింది ఆహారాలు గర్బవతులు అస్సలు తీసుకోకూడదని, అలా తింటే మాత్రం చాలా ప్రమాదమని అంటున్నారు.  ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ గర్భవతులు మొలకెత్తిన గింజలకు దూరం ఉండాలి. మొలకెత్తిన గింజలలో బ్యాక్టీరియా  ఎక్కువగా డవలప్ అవుతుంది.  వీటిని తింటే జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి. పాలు కూడా ఆరోగ్యానికి మంచివే అయినా పాశ్చరైజేషన్ చేయని పాలు మాత్రం గర్భవతులకు ప్రమాదం. వీటిలో  లిస్టేరియా, ఇకోలి, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి కడుపులో పెరుగుతున్న బిడ్డకు హాని కలిగిస్తాయి. ఉడికించిన కోడిగుడ్లు అందరికీ మంచివే.  అయితే కొందరు పచ్చిగుడ్లు కూడా తింటారు. మరికొందరు హాఫ్ బాయిల్ అంటూ సగం ఉడికీ ఉడకని గుడ్లు తింటారు. అయితే గర్భవతులు ఆరోగ్యం బాగుండాలంటే పచ్చిగుడ్లు తినడం అవాయిడ్ చేయాలి. దీవివల్ల వాంతులు, వికారం వంటి ప్రమాదాలు ఎదురవుతాయి. గర్భవతులు మద్యపానం, ధూమపానంకు దూరం ఉండాలి. ఇవి కడుపులో బిడ్డకు హాని కలిగిస్తాయి. సముద్రంలో లభించే క్యాట్ ఫిష్, షార్క్ వంటి చేపలలో పాదరసం ఎక్కువ శాతం ఉంటుంది. ఈ చేపలను తినడం వల్ల కడుపులో బిడ్డ నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. బొప్పాయికి, గర్భిణులకు మద్య ఉండే విషయాలు అందరికీ తెలిసిందే. అయితే పచ్చి బొప్పాయి తినడం వల్ల గర్భిణులకు గర్భస్రావం  అయ్యే కారణం ఉంటుంది. కాఫీ కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇందులో కెఫిన్ ఆరోగ్యం చేకూరుస్తుంది. కానీ కాపీ ఎక్కువ తాగితే కెఫిన్ కంటెంట్ కడుపులో బిడ్డపై చెడు ప్రభావం చూపిస్తుంది.  కెఫిన్ తొందరగా జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు కూడా పెరుగుతాయి.                                               *నిశ్శబ్ద.

బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మహిళలలో ఉన్న అపోహలు.. వాస్తవాలు! ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల జీవితంలో అయినా గొప్ప సందర్భం ఏదైనా ఉందంటే అది వారు తల్లికావడమే. నవమాసాలు మోసి బిడ్డను కంటారనే విషయం తెలిసిందే అయినా ఆ తొమ్మిది నెలలు మహిళలు తమ జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొంటార. ఆహారం దగ్గర నుండి శరీరాకృతి వరకు ప్రతి ఒక్కటీ మారిపోతుంది. అయితే ప్రసపం తరువాత పసిపిల్లలకు తల్లిపాలే ఆహారం. సుమారు 6నెలల వరకు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు కూడా చెబుతారు. అయితే తల్లిపాలు ఇవ్వడం గురించి చాలామంది మహిళలలో అపోహలు ఉన్నాయి. పాలు తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని,  ఎన్ని నెలల వరకు పిల్లలకు పాలు ఇవ్వాలని, తల్లిపాలకు ప్రత్యామ్నాయం ఏమిటని ఇలా చాలా విషయాలలో  అపోహలు, వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే అందరికీ ఈ విషయంలో ఒక అవగాహన ఏర్పడుతుంది. పాలివ్వడంలో అసౌకర్యం.. ప్రసవించిన తరువాత పిల్లలకు పాలివ్వడంలో ప్రతి తల్లీ అసౌకర్యానికి గురవుతుంది. పిల్లలు పాలు తాగడం లేదని, పాలు తాగడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటుంటారు. అయితే మొదటిసారి ప్రసవం అయిన మహిళలకు పిల్లలను హ్యాండిల్ చేయడం, రొమ్ములకు దగ్గరగా పిల్లలను పెట్టుకోవడం, పిల్లలకు సౌకర్యంగా ఉండటం వంటి వాటిలో కాస్త విఫలం అవుతారు. ఇది రోజులు గడిచేకొద్ది అలవాటు అవుతుంది. పిల్లలకు పాలిచ్చేటప్పుడు పెద్దల సహాయం తీసుకుంటే ఇందులో ఇబ్బంది చాలా వరకు అధిగమిస్తారు. పాలిచ్చే ముందు శుభ్రత.. చాలామంది పిల్లలకు పాలిచ్చే ముందు రొమ్ములను, చనుమొనలను శుభ్రం చేసుకోవడం గురించి మాట్లాడుతుంటారు. అయితే ఇలా శుభ్రం చేయాల్సిన అవసరమే లేదు. పిల్లలు ప్రసవించిన తరువాత తల్లిని వాసన, స్పర్శ ద్వారా గుర్తిస్తారు. చనుమొనలలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీని వాసన కారణంగా పిల్లలు తమ తల్లులను గుర్తిస్తారు. ఇది  పిల్లలకు  ఉపయోగకరమైనది. కాబట్టి పాలిచ్చే ముందు రొమ్ములను శుభ్రం చెయ్యాల్సిన అవసరం లేదు. పాలిచ్చే తల్లులు మందులు ఉపయోగించకూడదు.. పాలిచ్చే తల్లులు మందులు ఉపయోగిస్తే అవి పిల్లలకు చెడు చేస్తాయని చాలామంది అంటారు. అయితే పాలిచ్చే తల్లులు తమ సమస్యలను వైద్యులతో చెప్పేటప్పుడు పిల్లలకు పాలిస్తున్న విషయాన్ని చెప్పాలి. దీన్ని బట్టి వైద్యులు ప్రత్యేక మందులు సిఫారసు చేస్తారు. వీటి వల్ల తల్లీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే వైద్యులు సూచించిన విధంగానే మందులు తీసుకోవాలనే విషయం గుర్తుంచుకోవాలి. సొంతంగా మందులు వాడటం, వైద్యులు చెప్పిన నిర్ణీత కాలం కంటే  ఎక్కువ రోజులు  మందులు పొడిగించి వాడటం చేయకూడదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లిపాలివ్వకూడదు.. తల్లులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లలకు పాలివ్వకూడదని చాలా మంది అంటారు. అయితే ఇది తల్లులకు ఉన్న సమస్య పైన ఆధారపడి ఉంటుంది. తల్లి పాలు తాగడం వల్ల పిల్లలో కూడా కొన్ని వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే  ఆహారం, పుష్కలంగా ద్రవాలు తీసుకోవడం తల్లులకు ఎంతో ముఖ్యం. అనారోగ్యాన్ని బట్టి వైద్యుల సలహా మీద మాత్రమే పిల్లలకు పాలివ్వడం మంచిది. తల్లులకు పాల కొరత.. చాలామంది మహిళలు తమకు పాలు తక్కువ పడుతున్నాయని, పిల్లలకు సరిపోవడం లేదని ఫర్యాదు చేస్తుంటారు. అయితే ఇది చాలా వరకు అపోహే అని అంటున్నారు. బిడ్డను రొమ్ముపై సౌకర్యవంతంగా ఉంచుకుని పాలివ్వడంలోనే చాలావరకు పొరపాటు జరుగుతుందట. సౌకర్యవంతంగా పిల్లలకు రొమ్ము అందిస్తే పిల్లలు కూడా కడుపు నిండుగా పాలు తాగుతారు. అలాగే పిల్లలు పాలు ఎంత బాగా తాగితే తల్లులలో పాలు అంత బాగా ఉత్పత్తి అవుతాయి. ఆహారం.. పాలిచ్చే తల్లులు ఆహారం విషయంలో ఎలాంటి గందరగోళం చెందాల్సిన పనిలేదు. అందరిలానే పాలిచ్చే తల్లులు కూడా సమతుల్య ఆహారం తీసుకోవాలి. తల్లులు ఆరోగ్యంగా ఉన్నంతకాలం వారిలో పాలు ఉత్పత్తి కావడంలో సమస్యలు ఎదురే కావు. గమనిక: పై విషయాలు పోషకాహార నిపుణులు, మహిళా వైద్యులు పలుచోట్ల ప్రస్తావించిన అంశాల ఆధారంగా పొందపరచబడినవి.                                         *నిశ్శబ్ద. 

ఏం చేసినా హిమోగ్లోబిన్ పెరగట్లేదా? అయితే ఇలా చేయాల్సిందే.. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అవసరం అవుతాయి. శరీరం మొత్తం ఆరోగ్యాన్ని నిర్దేశించగల సామర్థ్యం రక్తానికి ఉంది. శరీరంలో హిమోగ్లోబిన్ సరిపడినంత లేకపోతే అది రక్తహీనతకు దారితీస్తుంది. ఈ రక్తహీనత ముఖ్యంగా మహిళల్లోనే ఎక్కువగా ఎదురవుతుంటుంది. ఐరన్ స్థాయిలు మెరుగుపరుచుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ ను భర్తీ చేసుకోవచ్చు. దీని కోసం మహిళలు తప్పక తినాల్సిన ఆహారాలేంటో తెలుసుకుంటే.. ఆహారంలో మొక్కల ఆధారిత పదార్థాలు అయిన గింజలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు మొదలైనవి పుష్కలంగా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే శరీరంలో ఐరన్ బాగా లభిస్తుంది. పైపెచ్చు ఇవి శరీరంలో ఐరన్ సరఫరాను కూడా ప్రోత్సహిస్తాయి. ఆకుకూరలు, పండ్లు, గింజలే కాకుండా ఆహారంలో లీన్ మాంసం, చికెన్, పాలు, గుడ్లు, బీన్స్, కాయధాన్యాలు, జున్ను, బచ్చలికూర, బ్రోకలీ వంటి వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. వీటిలో ఏవో కొన్ని అయినా రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే  తప్పనిసరిగా ఐరన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. చాలామంది ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకున్నా హిమోగ్లోబిన్ పెరగడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే విటమిన్-సి పుష్కలంగా తీసుకునేవారికే  ఐరన్ పెరుగుదల ఉంటుంది. ఎందుకంటే ఐరన్ ను శరీరం ఫర్పెక్ట్ గా గ్రహించడానికి విటమిన్-సి సహాయపడుతుంది. శరీరం ఐరన్ గ్రహించడానికి కేవలం విటమిన్-సి మాత్రమే కాదు, విటమిన్  బి12 కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆహారంలో పాలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు మొదలైనవాటిలో విటమిన్-బి12 ఉంటుంది. వీటిని తీసుకుంటే ఐరన్ ను కూడా సులువుగా పొందగలుగుతారు.                                                        *నిశ్శబ్ద.

మహిళలలో మెనోపాజ్.. ముఖ్యవిషయాలు ఇవే.. ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పనిసరిగా కొన్ని దశలు అదిగమించాలి. వీటిలో  12 నుండి 16ఏళ్లలోపు రజస్వల అయితే అది దాదాపు 30నుండి 40 ఏళ్ళపాటు  కొనసాగుతుంది. ఆ తరువాత ఈ నెలసరి ఆగిపోతుంది. ఇలా నెలసరి ఆగిపోవడాన్ని వైద్యపరిభాషలో మెనోపాజ్ అని అంటారు.  మెనోపాజ్ చెప్పడానికి సులువైన విషయమే అయినా దాన్ని ఎదుర్కొనే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. హార్మోన్లలో మార్పులు, శారీరక మార్పులు, శరీరంలో వేడి ఆవిర్లు, బరువు మొదలైన సమస్యలు ఎన్నో మహిళలను ఇబ్బంది పెడతాయి.  చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల మెనోపాజ్ చాలా నరకంగా అనిపిస్తుంది. దీని గురించి మహిళలకే కాకుండా వారి భాగస్వాములకు కూడా మెనోపాజ్ విషయంలో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది అక్టోబర్ 18వ తేదీన వరల్డ్ మెనోపాజ్ డే ని నిర్వహిస్తున్నారు. దీని లక్ష్యాలు, దీని చరిత్ర, దీని థీమ్ మొదలైన విషయాలు తెలుసుకుంటే.. ఈ ఏడాది ప్రపంచ మెనోపాజ్ డే థీమ్  కార్డియోవాస్కులర్ డిసీజ్. మహిళల పునరుత్పత్తి ఆరోగ్యం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మెనోపాజ్  కు చేరువ అవుతున్న మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. చరిత్ర.. ప్రపంచ మెనోపాజ్ డే ను 1984లో ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఇంటర్నేషనల్ మెనోపాజ్ సొసైటీ కలిసి స్థాపించాయి. నలభై ఏళ్ళ తరువాత మహిళలు ఈ సమస్యలో ఎదుర్కొనే పరిస్థితుల గురించి అవగాహన కల్పించడం ఈ రోజు ప్రధాన ఉద్దేశ్యం. ఒకప్పుడు  45 నుండి  55 సంవత్సరాల మధ్య మహిళలలో  పునరుత్పత్తి హార్మోన్లు సహజంగా  క్షీణించేవి. ఇది ఇప్పుడు కొందరిలో 40ఏళ్ల తరువాతే మొదలవుతోంది.   మెనోపాజ్ ఎదుర్కొంటున్న మహిళలలో  సాధారణ లక్షణాలైన వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు, మానసిక మార్పులు  నిద్ర భంగం వంటివి ఉంటాయి. ప్రతి మహిళ వీటి గురించి  తెలుసుకోవాలి. ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థ బలహీన పడటం వల్ల  గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరగడం,  ఆందోళన, నిరాశకు మొదలైన సమస్యలకు కూడా  కారణమవుతుంది. ప్రపంచ మెనోపాజ్ డే  చాలా  ముఖ్యమైనది, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది  స్త్రీలు ఇప్పటికీ మెనోపాజ్ సమస్య గురించి అవహాహన కలిగి లేరు, అలాగే దీని గురించి అవగాహన ఉన్న కొద్ది మంది కూడా దీని గురించి చర్చించలేకపోతున్నారు, అయినప్పటికీ ఇది మహిళల ఆరోగ్యంలో చాలా ముఖ్యమైన దశ. మెనోపాజ్ చాలా కాలం పాటు కొనసాగుతుంది.  పెరిమెనోపాజ్ పరిస్థితి మెనోపాజ్‌కు ఒక సంవత్సరం ముందు ప్రారంభమవుతుంది,   ఇది మహిళలకు అసౌకర్యాన్నికలిగిస్తుంది. సుమారు ఒక దశాబ్దం పాటు ఉంటుంది.  

బ్రా ధరించే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా.. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రాణాలను బలిగొంటున్న జబ్బు క్యాన్సర్. చాలామందిలో క్యాన్సర్ చివరి స్టేజ్ కు వచ్చాక తప్ప బయటపడదు. క్యాన్సర్ లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో మహిళలకు ఎక్కువగా ముప్పు కలిగించేది బ్రెస్ట్ క్యాన్సర్. సాధారణంగా నలభై సంవత్సరాలు దాటిన మహిళలలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  మహిళల రొమ్ములో మామూలుగానే కణజాలంతో ఏర్పడిన గడ్డలు ఉంటాయి. బ్రెస్ట్ ను చేత్తో తాకినప్పుడు ఈ గడ్డల స్పర్శ తెలుస్తుంటుంది. ఇవి ఏ మాత్రం ప్రమాదం లేనివి. పైపెచ్చు నొప్పి కూడా ఉండవు. కానీ రొమ్ము క్యాన్సర్ లో మాత్రం ఇవన్నీ పూర్తీగా వేరు వేరుగా ఉంటాయి. కొన్ని లక్షణాల ద్వారా రొమ్ము క్యాన్సర్ ను గుర్తించవచ్చు. అలాగే బ్రా వేసుకునే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వస్తుందా అనే విషయం నిజమా.. అబద్దమా.. పూర్తీగా తెలుసుకుంటే.. మహిళలకు రొమ్ములలో క్యాన్సర్ గడ్డలు పెరగడాన్ని రొమ్ము క్యాన్సర్ అని అంటారు. ఈ క్యాన్సర్ కణాలు పూర్తీగా  రొమ్మును మొత్తం ఆక్రమించాక  మహిళల ప్రాణాలు కాపాడాలంటే మాత్రం పూర్తీగా రొమ్మును తొలగించాల్సి ఉంటుంది. మహిళల శరీరంలో ముఖ్యభాగం అయిన రొమ్మును తొలగించడం అంటే అది ఎంతో ఆత్మన్యూనతకు దారి తీస్తుంది.  రొమ్ములో ఉండే కణాలలో క్యాన్సర్ కారకాలు చేరి అవి క్రమంగా కణజాలాలుగా రూపాంతరం చెంది క్యాన్సర్ గడ్డలుగా మారతాయి. ఈ క్యాన్సర్ గడ్డలు చేత్తో తాకితే నొప్పిగా ఉంటాయి. అంతేకాదు రొమ్ము మీద  ఉండే చనుమొనల నుండి రసి కారుతూ ఉంటుంది. చీము, రక్తం, ద్రవం కారుతూ ఉంటుంది. చనుమొన చుట్టూ దురద ఏర్పడి దాని కారణంగా కురుపులు వస్తాయి. క్యాన్సర్ గడ్డలు క్రమంగా పెరగడం వల్ల రొమ్ము పరిమాణం కూడా పెరుగుతుంది.  అయితే మహిళలలో నెలసరి సమస్యల సమయంలో రొమ్ములో గడ్డలలో మార్పులు, వాటిని తాకితే నొప్పి కలుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి సమయాన్నికూడా పరిగణలోకి తీసుకుంటూ రొమ్ములను సాధారణ రోజుల్లో పరీక్షించుకోవాలి. ఇకపోతే బ్రా ధరించే మహిళలకు గొమ్ము క్యాన్సర్ వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు అస్సలు లేవని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే బ్రాను నిర్ణీత సమయంలో మాత్రమే ధరించాలి. చాలావరకు వదులుగా ఉన్న దుస్తులు ధరించడం అన్నివిధాలా సురక్షితం. బ్రా ధరించే అలవాటు ఉన్న మహిళలు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే ధరించడం సురక్షితం. ఇంట్లో ఉన్న సమయంలోనూ, రాత్రి నిద్రించేముందు బ్రా తొలగించాలి. బ్రా లకు ఉండే ఎలాస్టిక్ మహిళల రొమ్ము ప్రాంతం నుండి కింద శరీర అవయవాలకు రక్తప్రసరణ జరగడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. చాలావరకు సుఖమైన నిద్ర సాధ్యం కాదు. అందుకే ఎల్లవేళలా బ్రా ధరించకూడదని వైద్యులు కూడా చెబుతారు. రొమ్ము క్యాన్సర్ కు బ్రాకు సంబంధం లేదు కానీ బ్రా కారణంగా ఇతర అసౌకర్యాలు అయితే ఉన్నాయి.  రొమ్ము క్యాన్సర్  అవగాహనా నెలగా అక్టోబర్ ను పేర్చొన్నారు. ఈ కారణంగా మహిళలు ప్రమాదకరమైన రొమ్ము క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం.                                                                      *నిశ్శబ్ద. 

మహిళలు గర్బం దాల్చడంలో మరింత గొప్ప ఫలితాలు పొందాలంటే ఈ టెస్ట్ బెస్ట్..     గర్బం దాల్చడం, తల్లి కావడం ప్రతి ఆడపిల్ల కల. కానీ దురదృష్టవశాత్తూ  ప్రస్తుతకాలంలో 12నుండి 15శాతం జంటలు  పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భార్యాభర్తల ఇద్దిరలోనూ పిల్లలు పుట్టడంలో తగినంత సామర్థ్యం లేకపోవడం వల్ల  చాలామంది పిల్లల కోసం వైద్యుల చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. లోపం ఎవరిలో ఉన్నా అది ప్రత్యక్షంగా మహిళల మీదే  కనిపిస్తుంది. కానీ చాలామంది మహిళలు గర్భం దాల్చడంలో  అవకాశాలు ఉన్నా కూడా విఫలమవుతుంటారు. దీనికి కారణం మహిళలకు గర్బం ధరించే సమయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో సరిగా అవగాహన లేకపోవడం. అయితే ఇప్పుడు దీన్ని కనుక్కోవడం సులభం. దీని వల్ల మహిళలు గర్బం ధరించే అవకాశాలు 20 నుండి 25శాతం ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎలా కనుక్కోవాలి? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. గర్భం దాల్చడానికి అద్బుతమార్గం.. మహిళలలో గర్బం దాల్చే అవకాశాలు  అండాలు విడుదల అయ్యే సమయంలో ఎక్కువగా ఉంటాయి. మూత్ర పరీక్ష ద్వారా అండోత్సర్గ పరీక్ష చేయించుకోవచ్చు.  ఈ అండోత్సర్గ పరీక్ష కిట్ సాధారణ మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది. లేదా దీన్ని వైద్యుల పర్యవేక్షణలో కూడా చేసుకోవచ్చు.  సాధారణంగా మహిళలలో ఋతుచక్రం  28రోజులుగా ఉంటుంది. చివరిసారి ఋతుక్రమం ప్రారంభమైన 11వ రోజున ఈ పరీక్షను చేసుకోవాలి. అండాలు విడుదల కావడానికి మూడు నుండి ఐదు రోజుల ముందు ఈ పరీక్షను చేసుకోవాలి.  ఈ పరీక్షలో టెస్ట్ కిట్ రంగు మార్పు కనబడితే మరొక 24నుండి 36గంటలలో అండాలు విడుదల కావడం ప్రారంభమవుతుందని అర్థం. దీన్ని అర్థం చేసుకుని భార్యాభర్తలు సంభోగంలో పాల్గొంటే ఆ సమయంలో మహిళలు గర్బం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండోత్సర్గానికి ఐదు రోజుల ముందు నుండి అండోత్సర్గము తర్వాత చాలా గంటల వరకు గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఈ కాలాన్ని ఫెర్టిలిటీ విండో అంటారు.  అండోత్సర్గము కాలం గురించి తెలుసుకోవడానికి  అల్ట్రాసౌండ్ కూడా  చేయవచ్చు లేదా ఋతు చక్రానికి సంబంధించిన హార్మోన్ల స్థాయిలను తెలుసుకోవడానికి మూత్ర పరీక్ష చేయించుకోవచ్చు.  ఇంకొక మార్గం ఏమిటంటే  గర్భాశయ శ్లేష్మం పర్యవేక్షణ సహాయంతో  అండోత్సర్గము కాలాన్ని కూడా తెలుసుకోవచ్చు. అండాలు పర్ఫెక్ట్ గా విడుదల అయ్యే సమయాన్ని తెలుసుకోవడానికి ఈ మార్గాలు  ఉన్నాయి. ఇవే కాకుండా  పీరియడ్ ట్రాకింగ్ యాప్ ద్వారా కూడా దీన్ని తెలుసుకోవచ్చు.  గర్భం దాల్చాలనుకుంటే లేదా చాలా కాలంగా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే,  వైద్యుని సలహా,  సహాయంతో ఈ మూత్రం అండోత్సర్గము పరీక్షను చేయవచ్చు. ఈ పరీక్ష సహాయంతో అండోత్సర్గము గురించి సమాచారాన్ని పూర్తీగా అర్థమవుతుంది కూడా.  తద్వారా  తొందరలోనే  గర్భం దాల్చవచ్చు.                                                             *నిశ్శబ్ద. 

రోజుకో గ్లాస్ ఈ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా? మూసాంబి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.  దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి, ఎ, ఫాస్పరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్, ఫోలేట్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మూసాంబి జ్యూస్, సిట్రస్ ఫ్రూట్, మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. మోసంబి జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.   ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జలుబును నివారిస్తుంది. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది: మీ శరీరానికి డిటాక్స్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఒత్తిడి, కాలుష్యం యొక్క విష ప్రభావాలను తొలగిస్తుంది, ఇది శరీరం యొక్క సహజ డిటాక్స్ సూపర్ స్టార్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుండి రక్షణ: విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, మొసాంబి మంట, వాపు నుండి రక్షణ, నివారణను అందిస్తుంది. ఈ అద్భుతమైన పండు ఆస్టియో ఆర్థరైటిస్,  రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడం: మూశంబి రసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది మీ కోరికలను అణచివేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల అదనపు కేలరీలు కరిగిపోతాయి. మోసంబి రసం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మానికి కాంతిని ఇస్తుంది: మెరిసే చర్మం పొందడానికి రోజూ ఒక గ్లాసు మోసాంబి జ్యూస్ తాగండి. ఇది మీ చర్మానికి మెరుపును ఇస్తుంది. మూసాంబిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబయాటిక్ పవర్‌తో, మీ చర్మం రక్షించబడి కాంతివంతంగా ఉంటుంది. మీ డల్ స్కిన్ కి గ్లో ఇస్తుంది. జీర్ణక్రియకు మంచిది: మోసంబి జ్యూస్ కేవలం దాహాన్ని తీర్చేది కాదు. సమతుల్య జీర్ణవ్యవస్థకు ఇది మంచి పానీయం. మీ జీర్ణ రసాలు శక్తిని పెంచుతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.  మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందుతాయి. ఇది జీర్ణ రసాలు, ఆమ్లాలు, పిత్త స్రావాన్ని పెంచడం ద్వారా జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచే ఫ్లేవనాయిడ్ల యొక్క అధిక కంటెంట్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల, అజీర్ణం, క్రమరహిత ప్రేగు కదలికలు, ఇతర జీర్ణశయాంతర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు మోసంబి జ్యూస్ చాలా మేలు చేస్తుంది.

పురుషుల కంటే మహిళలలోనే గుండె జబ్బులు అధికమవుతున్నాయి ఎందుకంటే.. గుండె జబ్బులు  ప్రాణాంతకం. గుండె జబ్బులు సాధారణంగా  పురుషులలో సర్వసాధారణం, కానీ గత కొన్ని సంవత్సరాలుగా మహిళల్లో కూడా  గుండె జబ్బుల రేటు వేగంగా పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం హృదయ సంబంధ సమస్యలు (CVD) భారతదేశంలో సుమారు 35 లక్షల మరణాలకు కారణమవుతోంది.  అందులో 16.9% మహిళలు ఉన్నారు.  గుండె ఆరోగ్యాన్ని చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి, వాటిలో ఒకటి ఒత్తిడి. ఒత్తిడి గుండె జబ్బులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది.  పురుషుల కంటే స్త్రీలు ఒత్తిడితో సులభంగా ప్రభావితమవుతారు. ఈ ఒత్తిడి నిద్రలేమితో కలిసి ఉంటుంది. దాదాపు ప్రతి నలుగురిలో ఒకరు నెలసరి తర్వాత క్రమం తప్పిన  హృదయ స్పందనను అనుభవిస్తారు.  ఒత్తిడి శరీరంలో మంటను పెంచుతుంది, ఇది అధిక రక్తపోటు,  తక్కువ 'మంచి'  కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది . ఒక వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు సరిగా నిద్రపోడు. ఇలాంటి  పరిస్థితిలో వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదా బరువును నియంత్రించడం వంటివి కూడా తగ్గుతాయి. ఈ జీవనశైలి మార్పులు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.  పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ మరియు డిప్రెషన్ వంటి మానసిక ప్రమాద కారకాలను పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే చిన్నతనంలో ఎదురైన  లైంగిక దాడులు గుర్తుకు రావడం వంటి సంఘటనలు  గుండెపై ఒత్తిడి పెంచుతాయి.  ఇవి మానసిక సమస్యలకు దారితీస్తాయి. ఇలాంటివి మహిళలు పెద్దగా పట్టించుకోరు.  మహిళల జివితంలో  విడాకులు, కుటుంబ సమస్యలు, ఇష్టమైనవారి   మరణం, దీర్ఘకాలిక అనారోగ్యం లేదా ప్రకృతి వైపరీత్యం వంటి జీవిత సంఘటనలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి.  ముఖ్యంగా నిర్దిష్ట వయస్సు తర్వాత ఈ సమస్యలను ఎదుర్కోవడం మహిళలకు మరింత కష్టతరం చేస్తుంది. భావోద్వేగ ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది , ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది.  కొరోనరీ ధమనులలో ఫలకం ఏర్పడుతుంది. భావోద్వేగ ఒత్తిడి కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను కూడా పెంచుతుంది. ఈ హార్మోన్లు ప్లేట్‌లెట్స్,  అటానమిక్ టోన్‌ను ప్రభావితం చేస్తాయి. ఇవి హృదయ స్పందన రేటు,  రక్తపోటు వంటి సహజ విధులను నియంత్రించడంలో శరీరానికి సహాయపడతాయి. ఇవన్నీ గుండె జబ్బులను పెంచుతాయి. మహిళల్లో హార్మోన్ల మార్పులు, ఒత్తిడి,  గుండె సమస్యలను  పెంచుతాయి . ఋతుస్రావం, గర్భం,  నెలసరి  సమయంలో ఇలా  స్త్రీ జీవితాంతం హార్మోన్ల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ హార్మోన్ల మార్పులు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు,  సాధారణ హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఒత్తిడి కారణంగా మహిళలకు గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడిని జీవితం నుండి తొలగించలేము, కానీ గుండె ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు, ముఖ్యంగా మహిళలకు వివిద  సందర్భంలో వచ్చే ప్రమాదాలను గుర్తించడం, వాటిని సమయానికి  పరిష్కరించడం ద్వారా మహిళల హృదయ ఆరోగ్యాన్ని రక్షించవచ్చు.                                      *నిశ్శబ్ద.

పిల్లలకు రాత్రి పూట ఈ 5 ఆహారాలు ఎందుకు ఇవ్వాలో తెలుసా...   ఆహారం ఎక్కువగా తిన్న తర్వాత మంచి నిద్రలోకి జారుకుంటాం. కానీ పిల్లల విషయంలో అలా కాదు! వారు ఏమి తినాలి? ఏమి తినకూడదు? అన్న అవగాహన చాలా మంది తల్లిదండ్రులకు ఉండదు. దీని కారణంగా పిల్లలు రాత్రి సమయంలో నిద్ర సమస్యను ఎదుర్కొంటారు. తల్లిదండ్రులు రాత్రిపూట శిశువు బాగా నిద్రపోవడానికి సహాయపడే ఆహారాన్ని ఇవ్వాలి. ఇటువంటి ఆహారాలు వారి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరానికి విటమిన్లను అందిస్తాయి. కాబట్టి శిశువుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఇక్కడ తెలుసుకోండి. పాలు: రాత్రిపూట పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల వారికి మంచి నిద్ర వస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్, కాల్షియం, విటమిన్ డి. మెలటోనిన్ ఉంటాయి. అవి నిద్రను ప్రోత్సహిస్తాయి. నిద్రవేళలో పాలు తాగడం వల్ల ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే మీరు ఇచ్చే పాలు కల్తీ లేకుండా ఉండేలా చూసుకోండి. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకోవడం మంచిది. పసుపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాదం: బాదంపప్పును సాధారణంగా పిల్లలకు ఉదయం పూట ఇస్తారు. ఇది మెదడుకు చాలా మంచిదని భావిస్తారు. కానీ రాత్రి పూట పిల్లలకు బాదంపప్పు తినిపించవచ్చు లేదా బాదంపప్పు కలిపిన పాలు తాగించవచ్చు. బాదం పాలలో మెలటోనిన్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మీ నిద్ర స్థాయిని పెంచుతుంది. అలాగే, వాల్‌నట్‌లలో మెలటోనిన్, సెరోటోనిన్, మెగ్నీషియం ఉన్నందున అవి కూడా ఒక ఎంపిక. అరటిపండ్లు: అరటిపండ్లు రోజులో ఏ సమయంలోనైనా 24 గంటలూ తినవచ్చు. వీటిని సూపర్ ఫుడ్స్ అంటారు. అయోడిన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి, అరటిలో మెగ్నీషియం, పొటాషియం, ట్రిప్టోఫాన్, విటమిన్ B6, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు పిల్లలకు అరటిపండు తినిపించండి . ఇది సంపూర్ణత్వం, మలబద్ధకం చికిత్స చేస్తుంది. చెర్రీస్: మంచి రాత్రి నిద్రకు చెర్రీస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిజానికి, చెర్రీస్ మీ పిల్లల డిన్నర్‌కు మంచి ఆప్షన్ గా ఉంటాయి. బీన్స్: చిక్కుళ్ళు సాధారణంగా రాత్రిపూట కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఎందుకంటే ఇందులో అధిక స్థాయిలో ప్రొటీన్లు, ట్రిప్టోఫాన్ ఉంటాయి. ఇది మంచి నిద్రకు ఉత్తమమైన ఆహారం. ఉదాహరణకు, చిక్‌పీస్‌లో ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్లు K, C మరియు B-6 కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది వాటిని గొప్ప, పోషకమైన విందు ఆహారంగా చేస్తుంది. మీ శిశువు ఆహారంలో చేర్చడానికి బీన్స్ ఉడికించి, గుజ్జు చేయడం మంచిది.

 మహిళలలో పిసిఒయస్ సమస్యకు కారణాలు.. పరిష్కార మార్గాలు.. ఒక వయసు వచ్చాక అమ్మాయిలలో ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి.  అవి మెల్లగా పెరుగుతూ మహిళలను చాలా రకాలుగా ఇబ్బందికి గురిచేస్తాయి. మహిళలలో సాధారణంగా కనిపించే సమస్యలలో పిసిఒఎస్ ఒకటి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ గా పిలువబడే ఈ సమస్య  మహిళలలో చాలా తీవ్రమైన పరిస్థితులకు కారణం అవుతుంది. ఇది ప్రధానంగా హార్మోన్ సమస్యగా పరిగణింపబడుతుంది.  పునరుత్పత్తి వయస్సు మహిళలలో వస్తుంది. ఈ సమస్య ఉన్న మహిళలలో నెలసరి రావడం నుండి, ఆ సమయంలో జరిగే ఋతుస్రావం వరకు చాలా విషయాలు ప్రభావితం అవుతాయి. ఇది పూర్తిగా మహిళల మానసిక  స్థితిని దెబ్బతీసే సమస్య.  పిసిఒఎస్ సమస్య గురించి మహిళలలో సరైన అవగాహన కలిగించడానికి,  ఈ సమస్యను అధిగమించే విషయంలో మహిళలను ప్రోత్సహించడానికి సెప్టెంబర్ నెలను పిసిఒయస్ అవగాహనా నెలగా కేటాయించారు.  మహిళలలో ఎక్కువగా కనిపించే ఈ సమస్య గురించి వివరంగా తెలుసుకుని, దీనికి పరిష్కార మార్గాలేమిటో విశ్లేషించడం ఎంతో ముఖ్యం. పిసిఒఎస్.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యకు ఖచ్చితమైన కారణం అంటూ ఏదీ  ఇప్పటి వరకు తెలియదు. ఆరోగ్య నిపుణులు మహిళలలో కనిపించే  కొన్ని మార్పుల కారణంగా  సమస్యకు మూలాన్ని అంచనా వేసి దానికి తగిన పరిష్కాలు సూచిస్తుంటారు. మహిళలలో  నెలసరి సమస్యలు రావడం, దీర్ఘకాలం రక్తస్రావం జరగడం, లేదా నెలసరిలో తగినంత రక్తస్రావం జరగకపోవడం వంటి సమస్యలు పిసిఒఎస్ సమస్యలున్న మహిళలలో కనిపిస్తుంటాయి.  ఇది చాలా కాలం  కొనసాగడం వల్ల మహిళలలో పిల్లలు పుట్టడంలో అవాంతరాలు ఏర్పడతాయి.  ఈ సమస్యకు అధికబరువు, హార్మోన్ అసమతుల్యత  ముఖ్యకారణాలు కావచ్చునని వైద్యులు చెబుతున్నారు.   నివారణ ఎలాగంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అధిక బరువు ఉన్న మహిళలలో పిసిఒఎస్ సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు బరువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నం చేస్తే ఈ సమస్య కూడా అంత తగ్గే అవకాశం ఉంటుంది.  బరువు నియంత్రణలోకి వచ్చే కొద్ది శరీరంలో హార్మోన్లు కూడా మెల్లిగా చక్కబడతాయి.  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, పోషకాల సహాయంతో బరువు తగ్గడం వల్ల పిసిఒఎస్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఆహారం.. పిసిఒయస్ సమస్యను నియంత్రించడానికి సరైన పోషకాహారం ముఖ్యం.  కార్భోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం తగ్గించాలి. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.  పిసిఒయస్ సమస్యను అరికట్టడానికి సింపుల్ గా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తగ్గించి వాటి స్థానంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవడం వల్ల చాలావరకు సమస్యను అదుపులో ఉంచవచ్చు. చురుగ్గా ఉండాలి..  ఒకేచోట కూర్చుని పనిచేయడం అధికబరువుకు ప్రధాన కారణం అవుతుంది. నేటికాలంలో బిజీ పేరుతో శారీరక వ్యాయామం చేయకపోడం కూడా అధికబరువుకు కారణమే. ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ జీవితం గడుపుతున్నా రోజులో కొద్దసేపు వ్యాయామం, యోగ, ధ్యానం మొదలైనవాటికి కేటాయించడం చాలా ముఖ్యం. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.  బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అధికబరువు ఉన్నా పిసిఒయస్ సమస్య ఉండకూడదు అంటే క్రమం  తప్పకుండా వాకింగ్, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. వీటిని పాటిస్తే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఫలితంగా పిసిఒయస్ సమస్య తగ్గిపోతుంది.                                                                 *నిశ్శబ్ద.  

 ఈ ఫుడ్స్ మీలో ఒత్తిడిని పెంచుతాయి..!! ఆందోళన అనేది నేడు సాధారణ సమస్య. ఒక వ్యక్తి ఉదయం నుండి సాయంత్రం వరకు రకరకాల పనులు, బాధ్యతల భారంలో చిక్కుకుపోతాడు, అతనికి తన కోసం సమయం దొరకదు. అటువంటి పరిస్థితిలో, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోలేనప్పుడు, చిరాకు, ఒత్తిడి వంటి సమస్యలు తప్పవు. దీని వల్ల మెదడు కూడా సరిగా పనిచేయదు, కానీ మీకు తెలుసా, కొన్ని ఆహార పదార్థాలు కూడా ఆందోళన కలిగిస్తాయి. ఇవి తింటే మీ ఒత్తిడి పెరుగుతుంది. కెఫిన్: మీరు అవసరానికి మించి టీ లేదా కాఫీ తాగితే , అది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒత్తిడి వచ్చే ప్రమాదం ఉంది. ఇది చిరాకు  భయము భావాలను సృష్టిస్తుంది. కెఫీన్ వల్ల నిద్ర కూడా దెబ్బతింటుంది కాబట్టి దానికి బదులు హెర్బల్ టీ, ఫ్రూట్ జ్యూస్ మొదలైన ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవాలి. మద్యం: ఆల్కహాల్ ఆరోగ్యానికి అత్యంత హానికరం. దీన్ని తాగడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అంతే కాకుండా అధికంగా ఆల్కహాల్ తాగడం వల్ల నిద్రలేమి, విటమిన్ బి లోపం, నిద్రలేమి మొదలైన సమస్యలు వస్తాయి. అధిక కొవ్వు ఆహారాలు:  కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. పరిశోధన ప్రకారం, అధిక మొత్తంలో తీపి, కొవ్వు పదార్ధాలను తినడం ఒత్తిడి ప్రమాదాన్ని పెంచుతుంది. ఉప్పు: ఉప్పు కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అంతే కాకుండా ఉప్పు ఎక్కువగా తింటే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని వల్ల మీరు అనేక రకాల వ్యాధులకు గురవుతారు. ఫాస్ట్ ఫుడ్స్: ఫాస్ట్ ఫుడ్స్ చాలామంది ఇష్టంగా తింటారు.  కానీ అది మీ మెదడును ప్రభావితం చేస్తుంది. మీరు మీ మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఫాస్ట్ ఫుడ్‌లకు దూరంగా ఉండండి. ఈ అనారోగ్యకరమైన వాటిని తినడం వల్ల మధుమేహం, బీపీ, ఊబకాయం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. వేయించిన ఆహారాలు: చాలామంది తరచుగా వేయించిన ఆహారాన్ని చిరుతిండిగా తింటారు. ఇది రుచిగా ఉంటుంది, కానీ ఇది ఆందోళన సమస్యలను కలిగిస్తుంది. ఈ ఆహారాలు మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి.