షాకింగ్.. వర్షను వదిలేసి శ్రావ్స్తో జోడీ కట్టిన ఇమ్మానియేల్!
on Apr 9, 2021
ఇమ్మానియేల్ను, వర్షను వేర్వేరుగా ఊహించగలమా! కానీ ఊహించుకోవాల్సిందే. దీనికి కారణం ఇమ్మానియేల్. లేటెస్ట్గా వర్షను వదిలేసి స్రవంతి అలియాస్ శ్రావ్స్తో జోడీ కట్టి అందర్నీ షాక్కు గురిచేశాడు. ఈ అనూహ్యమైన ఘటన జరిగింది 'ఉగాది జాతిరత్నాలు' ప్రోగ్రామ్లో! ఉగాది స్పెషల్ ఈవెంట్గా ఈటీవీ రూపొందించిన ఈ షోకు గెస్టులుగా 'టక్ జగదీష్' హీరో హీరోయిన్లు నాని, రీతు వర్మ అటెండ్ అయ్యారు. ఇందులో అనేకమంది టీవీ సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా జబర్దస్త్ బ్యాచ్ హంగామా చూసి తీరాల్సిందే.
స్టేజి మీదకు ఇమ్మానియేల్, స్రవంతి రాగానే పూలవర్షం కురిసింది. మొదట.. దీన్ని తన వర్ష చూస్తే ఏమైపోతుందోనని యాంకర్స్ సుడిగాలి సుధీర్, శ్రీముఖి దగ్గర ఆందోళన వ్యక్తం చేశాడు ఇమ్ము. "సరే వర్ష ఏదిరా?" అని అడిగాడు సుధీర్. "పండగ కదన్నా.. ఇంటికెళ్లింది." అని చెప్పాడు ఇమ్ము.
"పండగపూటే నీతో లేదంటే కష్టమొస్తే నీతో ఎలా ఉంటదిరా!" - సుధీర్.
"పండక్కీ, కష్టానికీ సంబంధం ఏముందన్నా?" - ఇమ్ము.
"అరే మనం కష్టపడితేనే పండగ చేసుకునేదిరా. నేను రోజూ కష్టపడతాను కాబట్టి రోజూ పండగుంటది నాకు." - సుధీర్.
దాంతో సుధీర్ వంక అయోమయంగా చూశాడు ఇమ్ము. అతడి ఎక్స్ప్రెషన్స్ చూసి అందరూ నవ్వేశారు.
"వద్దు. వర్ష వద్దు." అని స్రవంతి దగ్గరకు వెళ్లాడు ఇమ్ము.
శ్రీముఖి జోక్యం చేసుకొని, "ఒరే.. వర్ష అన్నావ్. వర్షం కురిసిన రాత్రన్నావ్?" అనడిగింది.
"ఎప్పుడో వచ్చే వర్షం కోసం ఇప్పుడు వచ్చే ట్యాప్ వాటర్ని కాదంటామా ఏంటి?" అని ఎదురు ప్రశ్నించాడు ఇమ్ము. దాంతో గుండెల మీద చేయేసుకుంది శ్రీముఖి.
"ఈమె ఆల్రెడీ నీ మీద చెయ్యేసేస్తోంది." అని చెప్పింది శ్రీముఖి.
"అంటే.. నా అనుకున్నా శ్రీ." చెప్పింది స్రవంతి. స్టన్నయి ఆమెవంక చూశాడు ఇమ్ము. తన మనసులో ఆల్రెడీ వర్ష ఉందని చెప్పాడు. దానికి స్రవంతి చెప్పిన ఆన్సర్కు కన్విన్స్ అయిన ఇమ్ము ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకుని, తిప్పాడు ఇమ్ము. దాంతో ప్రతి ఒక్కరూ షాకైపోయారు. జడ్జి పూర్ణ ఒక్కసారి కెమెరా వంక చూసి వర్ష లేదని చెప్పు చూద్దామని సవాల్ చేసింది. "కెమెరా చూశాను. వర్ష.. లేదు." అని చెప్పేశాడు ఇమ్ము.
"ఇదిగో నా బట్టతల మీద ఒట్టేసి చెబుతున్నా.. ఇకనుంచీ ఇమ్ము-వర్ష లేదు, ఇమ్ము-శ్రావ్సే. ఒకవేళ శ్రావ్స్ లేకపోతే శ్రీవ్స్ అయినా ఓకే".. అని శ్రీముఖి వంక చూశాడు ఇమ్ము. దాంతో నోరు తెరిచేసింది శ్రీముఖి.
ఈ షాకింగ్ షో ఉగాది రోజున ఈటీవీలో ప్రసారం కానున్నది. ఇందులో రష్మి, పూర్ణ, మనో, సంగీత, ఉదయభాను లాంటివాళ్లు కనువిందు చేయనున్నారు.
Also Read