నేనున్నానంటే మినిమమ్ ఉండాలి.. బరాబర్ ఇచ్చెయ్యడమే!
on Apr 7, 2021
పెళ్లి తర్వాత సింగర్ సునీత మరింత హుషారుగా, మరింత అందంగా కనిపిస్తున్నారు. పలు టీవీ మ్యూజికల్ షోలలో సింగర్గా అలరిస్తూ వస్తోన్న ఆమె తొలిసారి ఓ టీవీ షోకు జడ్జిగా వ్యవహరించేందుకు రెడీ అయ్యారు. జీ తెలుగులో ప్రసారం కానున్న డ్రామా జూనియర్స్ షోలో ఆమె డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నటి రేణు దేశాయ్లతో పాటు జడ్జి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
టాప్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ 4 షో ఈ నెల 11న రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నది. మొదట మెగా ఆడిషన్స్ పేరిట ఈ షో ఆడిషన్స్ ఎలా నిర్వహించారో చూపించనున్నారు. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్లో గ్రీన్ కలర్ శారీ, మల్టీ కలర్ బ్లౌజ్ ధరించి అందంగా ముస్తాబై వచ్చిన సునీత స్టేజిపై మైక్ పట్టుకొని మాట్లాడుతూ, నేనున్నానంటే మినిమమ్ ఉండాలి.. బరాబర్ ఇచ్చెయ్యడమే ఈ షోలో అని హుషారుగా హావభావాలు ఒలికిస్తూ చెప్పడం, ప్రదీప్ రెండు చేతులూ గుండెపై పెట్టుకొని అమ్మబాబోయ్ అనడం ఆకట్టుకుంటోంది. ప్రదీప్ అలా అనడంతో బిగ్గరగా నవ్వేశారు సునీత.
పలువురు పిల్లలు డ్రామా జూనియర్స్ షోలో తమలోని యాక్టింగ్ టాలెంట్ను ప్రదర్శించనున్నారు. అనసూయ, ఓంకార్ జడ్జిలుగా వ్యవహరించిన మునుపటి సీజన్ మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు కృష్ణారెడ్డి, రేణు, సునీత జడ్జిలుగా వ్యవహరించనుండటంతో ఈ సీజన్ మరింత రక్తికట్టే అవకాశం ఉంది.
Also Read