హైదరాబాద్లో 'కేజీఎఫ్ 2' ఫైనల్ షెడ్యూల్ ప్రారంభించిన యష్
on Nov 26, 2020
గురువారం, నవంబర్ 26న యష్ 'కేజీఎఫ్: చాప్టర్ 2' తుది షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించాడు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. డిసెంబర్ మధ్య దాకా యష్ హైదరాబాద్లోనే ఉంటాడని భావిస్తున్నారు. గురువారం ఉదయమే ఆయన సిటీకి వచ్చాడు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆయన కెమెరా కంటికి చిక్కాడు. ఆయన స్వెట్షర్ట్, డెనిమ్ ధరించి ఉన్నాడు. ముఖం కనిపించకుండా మాస్క్ ధరించాడు.
కొవిడ్-19 మహమ్మారి కారణంగా సుదీర్ఘ కాలం షూటింగ్ నిలిచిపోయి, కొద్ది రోజుల క్రితం పునరుద్ధరింపబడి, ఇప్పుడు తుది దశకు చేరుకోవడంతో యష్ సహా యూనిట్ మెంబర్స్ అంతా సూపర్ ఎక్జయిటింగ్తో ఉన్నారు. ఆగస్ట్ చివరలో బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్లో 'కేజీఎఫ్: చాప్టర్ 2' షూటింగ్ను పునరుద్ధరించారు. మూవీలో న్యూస్ చానల్ హెడ్ దీపా హెగ్డే రోల్ను పోషిస్తున్న నటి-పొలిటీషియన్ మాళవికా అవినాష్, షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు యష్తో దిగిన పిక్చర్ను షేర్ చేశారు.
రమికా సేన అనే కీలక పాత్రను రవీనా టాండన్ పోషిస్తున్నారు. అక్టోబర్ 26న తన బర్త్డే సందర్భంగా తన ఫస్ట్ లుక్ను ఆమె షేర్ చేశారు. అక్టోబర్ చివరి నాటికి ఈ సీక్వెల్ షూటింగ్ పూర్తయిపోతుందని నిర్మాతలు ఆశించారు. కానీ ఆలస్యం అయ్యింది. విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. 'కేజీఎఫ్: చాప్టర్ 2'లో విలన్ అధీర రోల్లో సంజయ్ దత్ను మనం చూడబోతున్నాం. ప్రకాశ్ రాజ్, శ్రీనిధి శెట్టి, అచ్యుత్ కుమార్ ఈ మూవీలో కనిపించనున్నారు.
ఈ మూవీని హోంబళే ఫిలిమ్స్ బ్యానర్పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఐదు భాషల్లో.. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళం భాషల్లో విడుదలవుతుంది. మొదటి చాప్టర్ భారతదేశ వ్యాప్తంగా బ్లాక్బస్టర్ హిట్టయింది. యష్ హీరోగా నటించిన ఈ చిత్రం, ఒక సామాన్యుడు ఎలా డేంజరస్ గ్యాంగ్స్టర్గా మారతాడో చూపించింది.
Also Read