నాకు కరోనా.. రెండు వారాల పాటు ఫోన్ చెయ్యకండి!
on Apr 7, 2021
ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్లో మరింత ఎక్కువగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పలువురు సెలబ్రిటీలు కరోనా బాధితులుగా మారుతున్నారు. తాజాగా బాహుబలి రైటర్ వి. విజయేంద్రప్రసాద్కు టెస్ట్లో కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించారు.
"నాకు టెస్ట్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. రెండు వారాల పాటకు నాకు ఫోన్లు చేయవద్దని స్నేహితులకు, నా అసోసియేట్స్కు విజ్ఞప్తి చేస్తున్నా. థాంక్ యూ." అని ఆయన రాసుకొచ్చారు. 78 సంవత్సరాల ఆయన ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు.
యస్.యస్. రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్, తన కుమారుడి సినిమాలన్నింటికీ స్క్రిప్ట్ రైటర్గా పనిచేస్తూ వస్తున్నారు. అంతే కాదు, బాలీవుడ్లో 'భజరంగీ భాయిజాన్', 'మణికర్ణిక', కోలీవుడ్లో 'మాస్టర్', 'తలైవి' చిత్రాలకు కూడా స్క్రిప్ట్ అందించారు. ఆయన స్క్రిప్ట్ అందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా సెట్స్ మీద ఉంది. అలాగే మహేశ్బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి కూడా ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసినట్లు సమాచారం.
గత ఏడాది రాజమౌళి ఫ్యామిలీ మొత్తం కొవిడ్-19 బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' టీమ్ విషయానికి వస్తే రామ్చరణ్, అజయ్ దేవ్గణ్, అలియా భట్ సైతం కొవిడ్ బాధితులే.
Also Read