'చరణ్-అర్జున్' వస్తారనుకుంటే.. 'ఎవడు' వచ్చాడు!
on Oct 23, 2020
రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో 'చరణ్-అర్జున్' టైటిల్తో చాలా ఏళ్ల క్రితమే ఓ సినిమా రావాల్సింది. ఎందుకనో ఆ సినిమాని అటక మీద పెట్టేశారు. ఆ టైటిల్ను 2010లోనే గీతా ఆర్ట్స్ సంస్థ రిజిస్టర్ చేయించింది. అయితే ఆ తర్వాత ఏడాదికి.. అంటే 2011లో గంటా శ్రీనివాసరావు, దిల్ రాజు కలిసి ఆ సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాల్చలేదు. దానికి బదులుగా 'ఎవడు' అనే సినిమా 2014లో దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చింది. అందులో చరణ్ హీరో కాగా, అర్జున్ అతిథి పాత్ర పోషించాడు.
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన 'కరణ్ అర్జున్' సినిమా బ్లాక్బస్టర్ హిట్టయ్యింది. ఆ టైటిల్కు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో చరణ్-అర్జున్ టైటిల్ను రిజిస్టర్ చేయించారు. పైగా ఈ రెండు పేర్లూ నిజ జీవిత హీరోలవే. ఇద్దరు హీరోలకు సమాన ప్రాతినిథ్యం ఉండే కథతో చరణ్, అర్జున్ ఓ సినిమా చేస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్నాడు చరణ్. ఇదే తరహాలో అర్జున్తో అతను సినిమా చేసే అవకాశాలున్నాయా?
Also Read