ఫస్ట్ ఫిల్మ్లోనే పవర్ స్టార్తో చేసిన ఆ తార ఎక్కడ?
on Aug 4, 2020
కొంతమంది తారల కెరీర్ బిగ్గెస్ట్ స్టార్తో నటించడం ద్వారా మొదలైనా, ఆ తర్వాత ఆశించిన రీతిలో అవకాశాలు లేక డల్గా సాగుతుంది. కొంతమందైతే కనుమరుగైపోతారు కూడా. ఇప్పుడు నికిషా పటేల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'పులి' (మొదట 'కొమరం పులి')లో హీరోయిన్గా నటించడం ద్వారా పదేళ్ల క్రితం యాక్టింగ్ కెరీర్ను మొదలుపెట్టిన నికిషా పటేల్ ఇప్పుడేం చేస్తోంది?
ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు ఫ్లాప్ హీరోయిన్ ముద్ర వేసేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ. దాంతో మరే స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ ఆమెకు రాలేదు. చివరిసారిగా సాయిరామ్ శంకర్ మూవీ 'అరకు రోడ్లో' కనిపించింది. అది కూడా డిజాస్టరే. మధ్యలో సినిమా ఛాన్సులు లేకపోవడంతో టీవీ రియాలిటీ షోలలో కంటెస్టెంట్గా కూడా పార్టిసిపేట్ చేసింది. చివరగా తమిళ సినిమాలు చేసింది.
గుజరాతీ మూలాలు ఉన్న ఆమె యుకేలో పుట్టి పెరిగింది. అందుకే లండన్కు వెళ్లిపోయి అక్కడి టాప్ టాలెంట్ ఏజెన్సీ అయిన రేగన్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ కుదుర్చుకొని టీవీ సిరీస్, ఫిలిమ్స్ చేయడానికి సిద్ధమవుతోంది. అవకాశం దొరికితే హాలీవుడ్కు వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తోందంట.