ధర్మేంద్రను పెళ్లి చేసుకుందనే కోపంతో హేమమాలిని వెంటపడ్డాడా సన్నీ?
on Nov 23, 2020
హిందీ చిత్రసీమలో ధర్మేంద్ర, హేమమాలిని పెళ్లి పెద్ద సంచలనం. చాలా కాలం వారి ప్రేమకథను జనం చెప్పుకున్నారు. హేమమాలిని లాంటి డ్రీమ్ గాళ్ను తన చార్మ్తో ప్రేమలో పడేశాడు అప్పటి టాప్ స్టార్స్లో ఒకరైన ధర్మేంద్ర. తెరపై వారి జోడీ ప్రేక్షకుల్ని అమితంగా అలరించిన మాట నిజం. మరో నిజం.. అది ధర్మేంద్రకు రెండో వివాహం. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆయన ప్రకాష్ కౌర్ను పెళ్లాడారు. వారికి నలుగురు పిల్లలు. అయినప్పటికీ హేమ సౌందర్యానికి ధర్మేంద్ర దాసోహమయ్యారు. ఆమె సైతం ఆయనతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపొయ్యారు.
హేమమాలిని పెళ్లి చేసుకుంటానని మొదటి భార్య ప్రకాష్ కౌర్కు ధర్మేంద్ర చెప్పినప్పుడు, విడాకులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు. హిందూ వివాహ చట్టం ప్రకారం మొదటి భార్యకు విడాకులివ్వకుండా రెండో వివాహం చేసుకోకూడదు కాబట్టి, 1979లో రెండో వివాహాన్ని సమ్మతించే ముస్లిం మతంలోకి మారారు ధర్మేంద్ర. ఇది ఆయన భార్యా పిల్లలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటి మీడియా రిపోర్టుల ప్రకారం తండ్రి చేసిన పనికి ఆగ్రహంతో ఊగిపోయిన పెద్ద కొడుకు సన్నీ డియోల్, ఒకసారి హేమమాలినిని పట్టుకోడానికి ఆమె వెంటపడ్డాడు. అవి చాలామంది కనుబొమ్మల్ని ముడిపడేలా చేశాయి. అయితే తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అలాంటిదేమీ జరగలేదని అప్పటి మీడియా రిపోర్టులను ప్రకాష్ కౌర్ ఖండించారు.
ధర్మేంద్ర రెండో వివాహంతో తను, తన పిల్లలు షాక్ గురైన మాట నిజమేననీ, అయితే పిల్లలను తాను బాగా పెంచడం వల్ల అలాంటి పనులెప్పుడూ వారు చేయలేదనీ ఆమె అన్నారు. తండ్రి నిర్ణయంతో సన్నీ, బాబీ డియోల్ ఇద్దరూ అప్సెట్ అయినప్పటికీ, ఆయనతో వారి అనుబంధంపై ఎలాంటి ప్రభావం కలిగించలేదని ప్రకాష్ కౌర్ చెప్పారు.
Also Read