'ఛత్రపత్రి' రీమేక్తో వి.వి. వినాయక్ బాలీవుడ్ ఎంట్రీ!
on Nov 26, 2020
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఛత్రపతి' సినిమా సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మాస్లో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. ఆ సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేయనున్నారనీ, దానితో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడనీ ఇప్పటికే మనకు తెలుసు. ఇప్పుడు ఇదే రీమేక్తో మరో పేరుపొందిన టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్కు పరిచయమవుతున్నాడు. ఆయన.. వి.వి. వినాయక్!
అవును. సాయిశ్రీనివాస్ను 'అల్లుడు శీను'తో హీరోగా లాంచ్ చేసిన వినాయక్, ఇప్పుడు బాలీవుడ్కు తనను తాను పరిచయం చేసుకుంటూ, సాయిశ్రీనివాస్నూ పరిచయం చేయనున్నాడు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. పేరుపొందిన బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ అధినేత జయంతీలాల్ గడా ఈ మేరకు ఓ ప్రెస్నోట్ను రిలీజ్ చేశారు. 'ఛత్రపతి' రీమేక్ను ఆయన నిర్మించనున్నారు.
సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ బాలీవుడ్లో అడుగుపెట్టడానికి నాకిది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్. డాక్టర్ గడాతో, పెన్ స్టూడియోస్తో కొలాబరేట్ కావడం, అలాగే నా తొలి డైరెక్టర్ వి.వి. వినాయక్ గారితో మరోసారి కలసి పనిచేయనుండటం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ప్రభాస్ చేసిన రోల్ను పోషించడం నామీదున్న పెద్ద బాధ్యత. కానీ అది చేయనుండటం సంతోషాన్నిస్తోంది. ఎందుకంటే, అది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని చెప్పాడు. త్వరలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
Also Read