బోయపాటి... దేవిశ్రీ... విమర్శలకు బలి!
on Nov 10, 2018
'ఒక్క దెబ్బకు రెండు పిట్టలు' సామెత గుర్తుందా? అచ్చంగా అటువంటి సందర్భమే ఇది. ఒక్క టీజర్ దెబ్బకు ఇద్దరు విమర్శల పాలవుతున్నారు. ఇద్దరిలో దర్శకుడు బోయపాటి శ్రీను కాగా.. మరొకరు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. రామ్ చరణ్ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ' టీజర్ శుక్రవారం ఉదయం విడుదలైంది. నెట్టింట్లో విమర్శల పర్వం మొదలైంది. ఇంటర్నెట్లో యూత్ బోయపాటిని, దేవిశ్రీని ఓ ఆట ఆదుకున్నారు. టీజర్లో కొత్తదనం ఏముందనీ, తన గత చిత్రాలను బోయపాటి కాపీ చేశాడని విమర్శించారు. దేవిశ్రీ ప్రసాద్ కూడా నేపథ్య సంగీతంలో కొత్తదనం చూపలేదనీ, 'జనతా గ్యారేజ్', 'శ్రీమంతుడు' చిత్రాల్లో ఉపయోగించిన సంగీతాన్ని ఉపయోగించడని ట్రోల్ చేశారు. 49 సెకన్ల టీజర్లో బోల్డన్ని కాపీలను ప్రేక్షకులు పట్టుకున్నారు. ముఖ్యంగా 'వినయ విధేయ రామ' టీజర్లో చూపించిన యాక్షన్ సీన్లు 'సరైనోడు'కు సీక్వెల్, 'జయ జానకి నాయక' పార్ట్ 2 అన్నట్టు వున్నాయని సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. వీటికి బోయపాటి ఏం సమాధానం చెబుతారో??