మనల్ని బీట్ చేసే ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎక్కడా లేరు!
on Mar 8, 2021
తెలుగు సినీ ప్రేక్షకులు ఎలాంటివారో, వాళ్ల విధేయత ఎలాంటిదో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పబ్లిగ్గా చెప్పుకొచ్చాడు. తెలుగు ఆడియెన్స్ను, ఫ్యాన్స్ను ఓడించేవాళ్లు ఎక్కడా లేరని కుండబద్దలుకొట్టాడు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ టైటిల్ పాత్రధారులుగా నాగ్ అశ్విన్ నిర్మించిన 'జాతిరత్నాలు' ప్రి రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్గా పాల్గొన్న విజయ్.. చాలాసేపు ప్రేక్షకుల గురించే మాట్లాడాడు.
"నేను బాంబే వెళ్లినా అక్కడి డైరెక్టర్లు, యాక్టర్లు నాతోని అరే.. మీ తెలుగు సినిమా ఆడియెన్స్ టూ మచ్ అబ్బా.. మస్తు చూస్తరు సినిమాలని! ఎంత ప్రేమిస్తరు యాక్టర్లని! అంటారు. నేను తిరిగి వాళ్లమీద ఎక్కేస్తా. వాళ్ల లాయల్టీ మీకు తెల్వదు." అని అతను చెప్పాడు. స్టేజ్ మీదున్న వాళ్లను చూపిస్తూ, "25 ఇయర్స్ ఇక్కడున్నోళ్ల పేర్లు కూడా మీకు తెల్వదు. హిమయత్నగర్లోనే మమ్మల్ని గుర్తుపట్టెటోళ్లు ఉండేవాళ్లు కాదు. ఇప్పుడు ఈ ఫంక్షన్కు 25 వేల మంది వచ్చిన్రు." అని అన్నాడు.
తిరిగి బాంబే వాళ్లతో తానేం చెప్పేవాడో తెలియజేస్తూ, "మావాళ్లు కొట్లాడి సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వస్తరు. మేం ఈవెంట్ అని అనౌన్స్ జేస్తే వేలమంది వస్తరు. మా గురించి ఎవరైనా తిక్కతిక్కగా మాట్లాడితే కొట్లాడతరు.' అని చెప్తాను" అన్నాడు.
ప్రేక్షకులను ఉద్దేశించి, "నేను ప్యాండమిక్లో మిడిల్ క్లాస్ ఫండ్ అని చేద్దామనుకుంటే మీరే వచ్చి చేసిన్రు, ఒక్క రూపాయి ఎక్స్పెక్ట్ చేయకుండా. వీళ్లంతా ఎట్లా పరిచయమైనరు మాకు.. సినిమా ద్వారానే. ఎక్కడ చూసినం! థియేటర్లు ఓపెన్ కాగానే ఇన్ని రిలీజ్లు ఎక్కడ చూసినం! ఇన్ని హిట్లు ఎక్కడ చూసినం! ఇన్ని పెద్ద సినిమా అనౌన్స్మెంట్లు ఎక్కడ చూసినం! ఇన్ని ప్యాన్ ఇండియా ఫిల్మ్ అనౌన్స్మెంట్లు ఎక్కడ చూసినం! ఇంత క్రౌడ్ ఎక్కడ చూసినం! మనమేగా!! మనని బీట్ చేసే ప్రేక్షకులు, మనని బీట్ చేసే ఫ్యాన్స్ ఎక్కడా లేరు. కాలర్ ఎగరేసుకొని గర్వంగా తిరగొచ్చు. మనలాంటి ఆడియెన్స్ ఎక్కడా లేరు. మీ అందరికీ థాంక్స్." అంటూ ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.