నారప్ప... నవంబర్లో ఐదు రోజులప్పా!
on Oct 22, 2020
కరోనా మహమ్మారి ప్రభావం చాలావరకూ తగ్గేవరకూ వేచి చూడాలని సురేష్ బాబు అనుకుంటుంటే... తమ్ముడు వెంకటేష్ మాత్రం చిత్రీకరణ చేయడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ్ముడు హీరోగా, అన్నయ్య నిర్మాతగా రూపొందుతున్న తాజా సినిమా 'నారప్ప'. నవంబర్ తొలి వారంలో చిత్రీకరణ పునః ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. దీనికి గడ్డం కూడా ఓ కారణమట.
నవంబర్ 5 నుండి 9 వరకూ ఓ ఐదు రోజులు చిత్రీకరణ చేయడానికి వెంకటేష్ ముందుకొచ్చారని తెలిసింది. ఈ సినిమా కోసం వెంకీ గడ్డం పెంచుకున్నారు. ఆల్రెడీ గడ్డంతో చాలా సన్నివేశాలు షూట్ చేశారు. మరికొన్ని సన్నివేశాలకు అవసరం కావడంతో అలాగే ఉంచారు. లాక్ డౌన్ లో గడ్డం తీయలేదు. ఇప్పుడు తీసేయాలని అనుకుంటున్నారు. గడ్డం అవసరమయ్యే సన్నివేశాలు ఐదు రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉండటంతో నవంబర్ తొలి వారంలో చిత్రీకరణ చేయాలని నిర్ణయించుకున్నారట. అవి చేసేస్తే ఫ్లాష్ బ్యాక్ సీన్లు మాత్రమే బ్యాలన్స్ ఉంటాయట.