కరణ్ జోహార్ ఆఫీస్కు జంటగా వచ్చిన వరుణ్, కియారా!
on Aug 8, 2020
ముంబై కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతుండటంతో బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా నాలుగున్నర నెలల కాలంగా మూతపడి ఉంది. అయితే ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా పనుల్లోకి రావడానికి ఇండస్ట్రీ వ్యక్తులు కృషి చేస్తున్నారు. షూటింగ్లు పునరుద్ధరింప బడుతున్నాయి. సినిమా ఆఫీసుల్లో మళ్లీ కోలాహలం కనిపిస్తోంది. అందులో భాగంగా ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్-ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఆఫీస్కు నడచుకుంటూ వెళ్తోన్న హీరో హీరోయిన్లు వరుణ్ ధావన్, కియారా అద్వానీలను ఒక పాపరాజ్జి తన కెమెరాతో క్లిక్ మనిపించాడు. ఆ ఇద్దరికీ కరణ్ గాడ్ఫాదర్ లాంటివాడు. తన ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా వాళ్లకు అనేక అవకాశాలు కల్పిస్తూ వస్తున్నాడు.
కరణ్ తీసిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతోటే వరుణ్ ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యాడు. అంతే కాదు.. ధర్మా ప్రొడక్షన్స్లో 'బద్రినాథ్ కీ దుల్హనియా', 'హంప్టీ శర్మా కీ దుల్హనియా', 'కళంక్' వంటి సినిమాలు చేశాడు. అలాగే కియారా సైతం ఇదే బ్యానర్లో 'లస్ట్ స్టోరీస్', 'కళంక్', 'గుడ్ న్యూస్', 'గిల్టీ' వంటి మూవీస్ చేసింది. ఇటీవల వరుణ్, కియారా కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. కరణ్ ఆఫీస్కు ఇద్దరూ మాస్క్లు వేసుకొని వచ్చారు. వరుణ్ బ్లూ జీన్స్ ధరించగా, కియారా గ్రీన్ గౌన్ వేసుకుంది.