ఆ ముగ్గురితో వంశీ పైడిపల్లి...
on Jul 28, 2018
రామ్ చరణ్, ఎన్టీఆర్,మహేష్ తో వంశీ పైడిపల్లి ? ఈ కాంబినేషన్ చూసి వీళ్ళేదో మూవీ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే పొరపాటే.అసలు విషయం ఏంటంటే నిన్న దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు. తన పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ఓ గ్రాండ్ పార్టీని ఇచ్చారు. ఈ పార్టీకి మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ హాజరై అందరినీ మరోసారి ఆశ్చర్యపరిచారు. వంశీపైడిపల్లితో వారు దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.వంశీ పైడిపెల్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ కూడా చేశారు మహేష్. ‘‘40 ఏళ్ల యంగ్ దర్శకుడు, నా స్నేహితుడు వంశీ పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. డౌటే లేదు 40 ఏళ్ళు కాదు 20 ఏళ్ళే.. ఎప్పుడు యంగ్గా ఉంటూ సంతోషంగా జీవించండి’’ అని టాగ్ చేస్తూ తాను, వంశీ కలిసి సెట్లో నడుస్తూ దిగిన ఓ ఫొటో జతచేశారు.
ఈ మధ్య కాలంలో ఒక హీరో మూవీ ఈవెంట్కి మరో హీరో గెస్ట్గా వెళ్లడం, ఒకరి ఫ్యామిలీతో మరొకరి ఫ్యామిలీ సన్నిహితంగా ఉండటం వంటివి సోషల్ మీడియా సాక్షిగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా స్టార్ హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్లు మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే విధంగా ఈ మధ్య వారి ఫొటోలు సంచరిస్తున్నాయి. వీరి అన్యోన్యతను చూసి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇది అనేలా ఇతర సినిమా ఇండస్ట్రీ వాళ్లు కూడా అనుకుంటున్నారంటే ఈ ముగ్గురి స్టార్ హీరోల స్నేహం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. ఈ మార్పు అంతా తన అభిమానుల కోసమే అని ఇటీవల ఓ ఈవెంట్లో మహేష్ బాబు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.