ఆగస్టులో వైష్ణవ్ తేజ్ సెకండ్ ఫిల్మ్
on Feb 25, 2021
కథానాయకుడిగా పరిచయమైన మొదటి సినిమాతోనే సంచలన విజయం సొంతం చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. `ఉప్పెన`తో డ్రీమ్ డెబ్యూ ఇచ్చిన ఈ మెగా కాంపౌండ్ హీరో.. త్వరలో క్రిష్ డైరెక్టోరియల్ తో పలకరించబోతున్నాడు. పాపులర్ నవల `కొండ పొలం` ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.
కాగా, చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో.. వాటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని వినికిడి. కాగా, ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయడానికి క్రిష్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట.
అదే గనుక నిజమైతే.. ఈ ఏడాది ఆగస్టులో వచ్చే మూడో మెగా కాంపౌండ్ ఫిల్మ్ ఇదే అవుతుంది. ఇప్పటికే ఆగస్టు 13న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ `పుష్ప`, ఆగస్టు 27న మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టిస్టారర్ `ఎఫ్ 3` రిలీజ్ డేట్స్ ని కన్ఫామ్ చేసుకున్నాయి. మరి.. వైష్ణవ్ ఏ తేదిన వస్తాడో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.