సినిమా వాళ్లు పురుగులు..
on Oct 5, 2016
ఉరి ఘటన, పీవోకేలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడంతో భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నటులపై నిషేధం విధిస్తూ భారతీయ నిర్మాతల మండలి ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాక్ నటులకు మద్ధతు తెలిపే వర్గం, వారిని విమర్శించే వర్గాలుగా బాలీవుడ్ విడిపోయింది. ఈ క్రమంలో ఆ రెండు వర్గాలకు చురకలంటించాడు సీనియర్ నటుడు నానా పాటేకర్. సినిమా వాళ్లంతా నకిలీ మనుషులని, వారికి జాతిని ఉద్దేశించి ప్రసంగించేంత అర్హత లేదని..వారు పురుగులతో సమానమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి మాటలను ప్రజలు కానీ..మీడియా కానీ పట్టించుకోనవసరం లేదని..అసలైన హీరోలు సరిహద్దుల్లో దేశం కోసం పోరాడే సైనికులు మాత్రమేనని నానా పాటేకర్ స్పష్టం చేశారు. సినిమా జనాలకు సీరియస్నెస్ ఉండదని, వారి అభిప్రాయాలకు నయాపైసా విలువ కూడా ఇవ్వనవసరం లేదన్నాడు. కళాకారులు, బోర్డర్ సమస్యల కన్నా దేశమే ముఖ్యమన్నారు.