`జాతిరత్నాలు`, `ఉప్పెన`.. జస్ట్ 2 డేస్ గ్యాప్
on Apr 7, 2021
ఫిబ్రవరి నెలలో వసూళ్ళ వర్షం కురిపించిన `ఉప్పెన`.. మార్చి మాసంలో కాసుల గలగలతో సందడి చేసిన `జాతిరత్నాలు`.. ఇప్పుడు థియేటర్స్ లో దాదాపుగా కనుమరుగయ్యాయి. అయితే.. కేవలం రెండు రోజుల గ్యాప్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీస్.. రెండు దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమ్ కానున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ టైటిల్ రోల్స్ లో నటించిన `జాతిరత్నాలు` ఈ నెల 11న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఈ రోజు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది కూడా. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న థియేటర్స్ లోకి వచ్చిన `జాతిరత్నాలు` సరిగ్గా నెల తరువాత ఓటీటీలోకి రావడం విశేషం.
ఇక వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన `ఉప్పెన` విషయానికి వస్తే.. ఫిబ్రవరి 12న రిలీజైన ఈ రొమాంటిక్ డ్రామా.. ఈ నెల 14న ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. రీసెంట్ గా .. `నెట్ ఫ్లిక్ ఇండియా` తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఏప్రిల్ నెల సినిమాల జాబితాలో `ఉప్పెన` 14న స్ట్రీమ్ కాబోతున్నట్లు పోస్ట్ చేసింది.
మొత్తమ్మీద.. నెల రోజుల వ్యవధిలో విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసిన రెండు సెన్సేషనల్ హిట్స్.. ఇప్పుడు కేవలం రెండు రోజుల గ్యాప్ లో ఓటీటీ బాట పట్టనుండడం వార్తల్లో నిలిచే అంశమనే చెప్పాలి.