అనుష్కపై అనవసర నిందలు! నిజమేమిటంటే...
on Sep 30, 2020
అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సార్థక నాయధేయురాలు అని అందరూ అంటుంటారు. ఆమె చిత్రసీమలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నటిగా ఆమె ఎంత ప్రతిభావంతురాలో చెబుతూ, వ్యక్తిగా ఆమెది ఎంత గొప్ప హృదయమో కూడా ఆ రోజు ఆమె శ్రేయోభిలాషులైన నిర్మాతలు, దర్శకులు తెలిపారు. హోదాతో, స్థాయితో నిమిత్తం లేకుండా తను పనిచేసే యూనిట్లోని అందరినీ నవ్వుతూ పలకరించే మంచి మనిషిగా అనుష్కను పేర్కొంటూ ఉంటారు. ఎవరినీ కష్టపెట్టకూడదనే మనస్తత్వం ఆమెది.
అలాంటి ఆమె 'నిశ్శబ్దం' సినిమా నిర్మాతకు ఎందుకు సహకరించడం లేదు? ఈ ప్రశ్న చూడగానే ఎవరికైనా నిజమా.. అనుష్క అలా చేస్తోందా? అనే సందేహాలు రావడం సహజం. నిజానికి ఇది నిజం కాదు. అలా అని మీడియాలోని కొంతమంది ప్రచారం మొదలుపెట్టారు. 'నిశ్శబ్దం' మూవీని నిర్మాతలు అక్టోబర్ 2న నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయడం ఆమెకు ఇష్టం లేదంట. అందుకని ఆ మూవీ ప్రమోషన్స్లో పాల్గొనడానికి ఆమె ఇష్టం చూపడం లేదంట. ఆఖరుకి మీడియా ఇంటరాక్షన్లకు రావడానికి కూడా ఆమె విముఖత చూపిస్తోందట... అని ఆ వదంతుల ప్రచారకర్తలు ఒక వివాదాన్ని లేవనెత్తడానికి యత్నించారు.
కానీ అనుష్క సంగతి, ఆమె మంచి మనసు తెలిసినవాళ్లెవరూ ఆ ప్రచారాన్ని నమ్మలేదనుకోండి. 'నిశ్శబ్దం' సినిమా గురించి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆమె షేర్ చేసిన పిక్చర్లు, వీడియోలు దీనికి నిదర్శనమని మనకు తెలుసు. నిర్మాతలు ఎప్పుడంటే అప్పుడు తన వంతు ప్రచారానికి సిద్ధమని ఆమె చాలా రోజుల క్రితమే చెప్పిందని యూనిట్ సభ్యులు తెలిపారు. వాళ్ల కోరిక మేరకే మంగళవారం మీడియాకు ఇంటర్వ్యూ సైతం ఇచ్చారు. నెగటివ్ ప్రచారకర్తల ప్రచారం మొదలవకముందే ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడానికి టైమ్ ఇచ్చారు. డైరెక్టర్ హేమంత్ మధుకర్ని అడిగినా, నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ని అడిగినా ఆమె ఎంతటి స్నేహపాత్రురాలో చెబుతారు. అనుష్క గురించి అలాంటి ప్రచారం చెయ్యాలని వాళ్లకు ఎలా అనిపించిందని వాళ్లు ఎదురు ప్రశ్నిస్తున్నారు. దటీజ్ అనుష్క.
Also Read