రైతు వ్యతిరేక ట్వీట్.. కంగనపై కేసు ఫైల్ చేసిన పోలీసులు!
on Oct 14, 2020
పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై ట్వీట్ చేసినందుకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కర్ణాటకలోని తుమ్కూర్ జిల్లా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రైతులపై ట్వీట్ చేసినందుకు కంగనా రనౌత్పై కేసు నమోదు చేయాల్సిందిగా తుమ్కూర్ కోర్టు స్థానిక క్యాతాసంద్ర పోలీస్ స్టేషన్ను గత వారం ఆదేశించింది.
గత నెలలో న్యాయవాది ఎల్. రమేష్ నాయక్ ఫిర్యాదు చేసిన తరువాత ఈ తీర్పు వచ్చింది. "పాపులర్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై నేను కేసు పెట్టింది పబ్లిసిటీ పొందడం కోసం కాదు, తను చేసింది తప్పని ఆమెకు తెలియజెయ్యడానికి. ఏ ప్రభుత్వ విధానానికైనా నిరసన తెలపడానికి రైతులు వీధుల్లోకి వచ్చినప్పుడు, ఆమె భావించినట్లు, వారు ఉగ్రవాదులు కానవసరం లేదు. నేను అలాంటి అనేక నిరసనల్లో పాల్గొన్నాను. నేను టెర్రరిస్టునా? దీనిపై నాకు క్లారిఫికేషన్ కావాలి. అందుకే ఈ కేసుతో పోరాడుతున్నా" అని ఆయన తెలిపారు.
సెప్టెంబర్ 21న కంగన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా, "సీఏఏ గురించి తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చేయడం ద్వారా అల్లర్లకు కారణమైన జనం, ఇప్పుడు రైతుల బిల్లుల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ, దేశంలో బీభత్సం సృష్టిస్తున్నారు. వారు టెర్రరిస్టులు." అని పోస్ట్ చేశారు.
Also Read