అజ్ఞాతవాసి పుణ్యామా అని ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ తగ్గించారు
on Mar 24, 2018
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రొడ్యూసర్ రాధాకృష్ణలది విడదీయరాని బంధం. జులాయి నుండి మొదలయిన వీరి సినిమా జర్నీ ఇప్పటికీ కొనసాగుతుంది. త్రివిక్రమ్ ఈ మధ్యకాలంలో చేసిన అన్ని సినిమాలకి నిర్మాత రాధాకృష్ణే. వీరి కలయికలో వచ్చిన చివరి సినిమా అజ్ఞాతవాసి డిజాస్టర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఉన్నప్పటికీ, ఆ సినిమా నష్టాల భారీ నుండి తప్పించుకోలేకపోయింది. అయితే, త్రివిక్రమ్ తదుపరి చిత్రానికి కూడా రాధాకృష్ణే నిర్మాత. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో చేస్తున్న ఈ చిత్రానికి నిర్మాత చాలా తక్కువ బడ్జెట్ కేటాయించాడట. బడ్జెట్ తక్కువ అయ్యేలా స్టోరీ సెట్ చెయ్యమని త్రివిక్రమ్ కి చెప్పాడట. దీనికి ఒకే చెప్పిన మాటల మాంత్రికుడు ఎన్టీఆర్ ని కూడా ఒప్పించాడట. స్టోరీ నచ్చడంతో, ఎన్టీఆర్ కూడా అభ్యంతరం చెప్పలేదట. షూటింగ్ మొత్తం ఒకే షెడ్యూల్ లో హైదరాబాద్ లోని భారీ సెట్లో తీస్తారట. సాంగ్స్ కోసం ఫారిన్ కూడా వెళ్లట్లేదట. సో, అనుకున్న బడ్జెట్ లో సినిమాని పూర్తి చేసి తన మిత్రుడు రాధాకృష్ణకు అజ్ఞాతవాసి మిగిల్చిన నష్టాల్ని పూడ్చాలని కృతనిశ్చయంతో ఉన్నాడట త్రివిక్రమ్. ఇందుకు, ఎన్టీఆర్ సహకరించడం నిజంగా గొప్ప విషయం.