త్రిష ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. కమల్హాసన్ స్పందన..
on Jan 16, 2017
జల్లికట్టు పుణ్యమా అంటూ గత రెండు రోజులుగా హీరోయిన్ త్రిష వార్తల్లో నిలిచింది. ఇప్పటికే జల్లికట్టు అభిమానులు త్రిష చనిపోయిందంటూ పోస్టర్లు వేసి వాటిని సోషల్ మీడియాలోకి వదిలారు. అది చూసిన త్రిష ఆగ్రహంతో వారిపై మండిపోయిన సంగతి కూడా విదితమే. ఇప్పుడు కొత్తగా త్రిష ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ గురైందంటూ వార్తలు వస్తున్నాయి. త్రిష తల్లి ఉమా కృష్ణన్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఎవరో ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేసి జల్లికట్టుకు వ్యతిరేకంగా కామెంట్లు పోస్ట్ చేశారని..తాము జల్లికట్టుకు వ్యతిరేకం కాదని.. త్రిషను ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో కొందరు వ్యక్తులు ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేసి ఉంటారని ఉమా కృష్ణన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక దీనిపై స్పందించిన కమల్హాసన్ స్పందిస్తూ త్రిషను ఇబ్బంది పెట్టడం సరికాదు.. ఇలాంటి చేష్టలతో కీలకమైన అంశాన్ని బలహీనపరచొద్దు. నిర్ణయం తీసుకునే వాళ్ల మీద మనం పోరాటం చేయాలి కానీ మామూలు వ్యక్తుల మీద కాదంటూ ట్వీట్ చేశాడు. మరి ఇప్పటికైనా జల్లికట్టు అభిమానులు ఊరుకుంటారా.. లేక ఇలానే త్రిషపై తమ కోపాన్ని ప్రదర్శిస్తారా..? చూద్దాం ఏం జరుగుతుందో.