చిరంజీవి విషయంలో త్రిష తప్పు చేసిందా?
on Apr 9, 2020
మెగాస్టార్ చిరంజీవి సినిమా విషయంలో త్రిష తప్పు చేసిందా? మణిరత్నం సినిమా కోసం చిరంజీవి సినిమా వదులుకుందా? తప్పు తనవైపు పెట్టుకొని 'ఆచార్య' టీమ్ది తప్పు అన్నట్టు ట్వీట్ చేసిందా? చిరంజీవి చెప్పిన వెర్షన్ చూస్తే అటువంటి అనుమానాలు కలుగుతున్నాయి.
సుమారు 14 సంవత్సరాల క్రితం 'స్టాలిన్' సినిమాలో చిరంజీవి, త్రిష జంటగా నటించారు. 'ఆచార్య' సినిమాలోఈ జంటను రిపీట్ చేయాలని దర్శకుడు కొరటాల శివ అనుకున్నారు. చిరంజీవికి జోడీగా త్రిషను ఎంపిక చేశారు. త్వరలో ఆమె చిత్రీకరణలో పాల్గొంటుందనగా, సినిమా నుండి తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా 'ఆచార్య' నుండి వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారు. అయితే... చిరు వెర్షన్ వేరేలా ఉంది.
"త్రిష ఎందుకు తప్పుకొందో తెలియదు. మా అమ్మాయి (సుష్మిత, ఆచార్య కాస్ట్యూమ్ డిజైనర్) తనకు ఔట్ఫిట్స్ (దుస్తులు) కూడా పంపింది. ఎవరైనా తనను అప్సెట్ చేశారా? అని మా టీమ్ని అడిగా. తర్వాత తెలిసింది ఏంటంటే... తను మణిరత్నం సినిమా (పొన్నియన్ సెల్వన్) చేస్తోంది. ఆ సినిమా షూటింగులో ఎక్కువ రోజులు పాల్గొనాల్సిన కారణంగా మా సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది" అని చిరంజీవి లేటెస్టుగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పకుండా క్రియేటివ్ డిఫరెన్సెస్ అని ట్వీట్ చేసి, త్రిష విషయంలో చిరంజీవి 'ఆచార్య' టీమ్ ఏదో తప్పు చేసిందని ప్రేక్షకులు అనుకునేలా ఆమె వ్యవహరించిందని మెగాభిమానులు మండిపడుతున్నారు.
Also Read