రజనీ, మహేశ్, బన్నీ నిర్మాతల గుండెల్లో రైళ్లు!
on Dec 16, 2017
మహేశ్ బాబు, అల్లు అర్జున్ నిర్మాతలు భయంతో వణికిపోతున్నారు. అదేంటి? సినిమా వసూళ్లలో ఇద్దరూ కింగులే కాదా. వారి నిర్మాతలకు భయం దేనికి అనుకుంటున్నారా? నిజమే వారి నిర్మాతలు గడగడ లాడిపోతున్నారు. డిజిటల్ ప్రొవైడర్ల ఆధిపత్యాన్ని నిరసిస్తూ... మార్చి 1 నుంచి చిత్ర పరిశ్రమ బంద్ కి పిలుపు నివ్వడమే వారి భయానికి కారణం. ‘ఇది ధ్నర్మాగ్రహం.. ఈ బంద్ ఎన్ని రోజులు జరుగుతుందో చెప్పలేం.’ అంటూ నిర్మాత సురేశ్ బాబు ఇచ్చిన స్టేట్మెంట్ సదరు నిర్మాతల గుండెల్లో పిడుగు పడేలా చేసింది. ఎందుకంటే.... అదే నెలలో మహేశ్ ’భరత్ అను నేను‘ , బన్నీ ‘నా పేరు సూర్య నా ఊరు ఇండియా’ విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. ఉన్నట్టుండి ఇలాంటి పిడుగులాంటి వార్త చెవిన పడటంతో ఇప్పుడు ఆ నిర్మాతల పని కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. రజనీకాంత్ ‘రోబో 2.0‘ కూడా అదే నెలలో రాబోతోంది. తెలుగులో రజనీకాంత్ మార్కెట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ ఆ సినిమా విడుదల సమయంలో బంద్ ఉంటే... ‘రోబో 2.0‘ వసూళ్లపై అది బలమైన ప్రభావమే చూపించక మానదు. అంతేకాదు... ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాను కూడా అదే నెలలో విడుదల చేయాలనుకున్నారు. సో.... మార్చిలో విడుదల చేస్తే బంద్ దెబ్బకు దెబ్బడిపోతాం. సమ్మర్ కెళితే... వడ్డిలు బొక్క. లాభం గూబలోకొస్తుంది. మరి తెలిసి తెలిసీ ఎవరు ప్రమాదం కొనితెచ్చుకుంటారు చెప్పండి? సమయం ఎలాగూ ఉంది... త్వరత్వరగా పూర్తి చేసేసి ఫిబ్రవరిలో వచ్చేస్తే బెటర్ అని కొందరి అభిప్రాయం.