సింగరేణి బ్యాక్డ్రాప్లో ‘పరేషాన్’
on Oct 22, 2020
టాలీవుడ్లో తెలంగాణ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు తక్కువ. గోదావరి బ్యాక్డ్రాప్లో వచ్చినన్ని సినిమాలు తెలంగాణ బ్యాక్డ్రాప్లో రాలేదు. ఇటీవల తెలంగాణ నేపథ్యంలోనూ సినిమాలొస్తున్నాయి. అలాంటి ఓ సినిమాలో తిరువీర్ హీరోగా నటిస్తున్నాడు. సింగరేణి బ్యాక్డ్రాప్లో ఓ ఫన్నీ ఫిల్మ్ చేశాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘పలాస 1978’ సినిమాలు, ‘సిన్’ వెబ్ సిరీస్ చేసిన తిరువీర్ హీరోగా ‘కొబ్బరిమట్ట’ ఫేమ్ రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కింది. దీనికి ‘పరేషాన్’ టైటిల్ ఖరారు చేశారట.
సైలెంట్గా ఎవరికీ తెలియకుండా ‘పరేషాన్’ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆగస్టులో మంచిర్యాల వెళ్లిన సినిమా యూనిట్ 55 రోజులు చిత్రీకరణ చేసి మొత్తం సినిమా కంప్లీట్ చేశారు. సింగరేణి బొగ్గు గనుల్లో ఓ ఉద్యోగి కుమాకుడిగా, తండ్రి ఉద్యోగం తనకు ఎప్పుడొస్తుందని ఎదురుచూసే యువకుడి క్యారెక్టర్లో తిరువీర్ కనిపిస్తాడట. ఇంతకు ముందు సినిమాల్లో సీరియస్ రోల్స్ చేసిన అతడు, ఇందులో కామెడీ ట్రై చేయనున్నాడు.