ప్రభాస్కి తమ్ముడిగా ప్రకాష్?
on Nov 24, 2020
'బాహుబలి' సిరీస్, 'సాహో' తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న పాన్ ఇండియా వెంచర్ 'రాధే శ్యామ్'. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ పిరియడ్ రొమాంటిక్ సాగాని యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. 'జిల్' రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. 2021 వేసవిలో పలు భాషల్లో సందడి చేయనుంది. కాగా, ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ కి తమ్ముడిగా ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ నటించబోతున్నాడట. అంతేకాదు.. కథలో చాలా కీలకమైన పాత్ర ఇదని సమాచారం.
తొలుత ఈ పాత్ర కోసం 'గద్దలకొండ గణేష్' ఫేమ్ అధర్వ మురళిని తీసుకోవాలని భావించిందట రాధాకృష్ణ అండ్ టీమ్. అయితే చివరాఖరికి ప్రకాష్ కి ఆ అవకాశం దక్కిందని టాక్. త్వరలోనే 'రాధే శ్యామ్'లో జీవీ ప్రకాష్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా, 'రాధేశ్యామ్' సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుందని బజ్.