హీరోలు అభిమానులందరూ ఏకమై...
on Jul 1, 2020
ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్స్ చూస్తుంటాం. బట్, ఫర్ ఎ ఛేంజ్, ఫస్ట్ టైమ్ టాలీవుడ్లో హీరోలందరి ఫ్యాన్స్ ఏకమయ్యారు. దీనికి కారణం దర్శకుడు తరుణ్ భాస్కర్. మొన్నామధ్య ఓ తమిళ సినిమాను పొగుడుతూ ఇన్స్టా స్టోరీలో అతను ఓ పోస్ట్ చేశాడు. ఇన్డైరెక్టుగా సూపర్స్టార్ మహేష్బాబును టార్గెట్ చేశాడని అభిమానులు ఫీల్ అయ్యారు. దర్శకుడిని ట్రోల్ చేశారు. తనపై ట్రోల్స్ చేసిన, కామెంట్ చేసిన సోషల్ మీడియా అకౌంట్స్ మీద పోలీసులకు తరుణ్ భాస్కర్ కంప్లయింట్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని ట్వీట్ కూడా చేశారు. అందులో ఎవరిపై అయితే కంప్లయింట్ ఇచ్చారో, వాళ్ల ఫోన్ నంబర్ కనిపించకుండా చేశారు.
తరుణ్ భాస్కర్ కంప్లయింట్ ఇచ్చినది మహేష్బాబు వీరాభిమానులు అనుదీప్, కృష్ణతేజపై అని తెలుస్తోంది. వాళ్లిద్దరికీ మద్దతుగా హీరోల అభిమానులు అందరూ ఏకమయ్యారు. ‘వుయ్ స్టాండ్ విత్ అనుదీప్ అండ్ కృష్ణతేజ’ హ్యాష్ట్యాగ్తో పోస్టులు చేస్తున్నారు. కంప్లయింట్ ఇవ్వడానికి ముందు సోషల్ మీడియాలో ఒకసారి మాట్లాడాలని ఫోన్ నంబర్ అడిగిన తరుణ్ భాస్కర్, తరవాత కంప్లయింట్ చేశాడని సోషల్ మీడియాలో కొన్ని స్ర్కీన్షాట్స్ చూస్తే తెలుస్తోంది. తరుణ్ భాస్కర్ సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్గా చేసిన సాయికృష్ణను సైతం అభిమానులలో కొందరు టార్గెట్ చేశారు. ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో? కొంతమంది అభిమానులు ఫోనులు చేసి తమను తరుణ్ భాస్కర్ బెదిరించాడని ఆరోపిస్తున్నారు.