తెలుగు కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య..
on Dec 11, 2017
స్వాతి కిరణం సినిమాలో బాల నటుడిగా నటించి అందర్నీ మెప్పించి ఆ తర్వాత కమెడియన్ గా పలు సినిమాల్లో నటించిన విజయ్ సాయి నిన్న రాత్రి 9 గంటలకి యూసఫ్ గూడ లోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మాయిలు అబ్బాయిలు, బొమ్మరిల్లు, యూత్, పార్టీ, సోగ్గాడు, బృందావనం, మిస్టర్ మన్మధ, ధనలక్ష్మి తలుపు తడితే లాంటి చిత్రాల్లో కనిపించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు లాంటి సినిమాల్లో తింగరోడిలా చేసి ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించిన విజయ్ సాయి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియదు. అయితే, అందరితో సన్నిహితంగా ఉండే విజయ్ సాయి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అతడి సన్నిహితులకు పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. తాజా సమాచారం ప్రకారం, కుటుంబ కలహాలు, భార్యతో గొడవల వల్ల గత కొన్ని రోజుల నుండి ఒత్తిడికి గురయ్యాడట. కేస్ రిజిస్టర్ చేసుకున్న పోలీసులు ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు.
Also Read