బైలింగ్వల్ మూవీలో హీరోయిన్ గా ఈషా రెబ్బా
on Jun 12, 2021
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా మలయాళం ఇండస్ట్రీలో డెబ్యూ చేయబోతుంది. 'ఒట్టు' అనే టైటిల్ తో మలయాళం-తమిళ బైలింగ్వల్ మూవీ ఒకటి తెరకెక్కుతోంది. డైరెక్టర్ ఫెల్లిని రూపొందిస్తున్న ఈ సినిమాలో.. తమిళ్ స్టార్ యాక్టర్ అరవింద్ స్వామి కూడా నటించనున్నారు.
ఈ మూవీలో కుంచాకో బోబన్ హీరో కాగా.. హీరోయిన్ గా ఈషా రెబ్బా నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ గోవాలో మొదలు కానుంది. అందులో ఈషా పాల్గొననుంది. ఈ సినిమా కోసం ఈషా రైఫిల్ షూటింగ్, బాక్సింగ్ నేర్చుకుంటుందని తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈషా మాట్లాడుతూ.. ఈ మూవీ స్క్రిప్ట్ తనకి బాగా నచ్చిందని, ఈ మూవీలో తన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పింది.
'అంతకు ముందు ఆ తరువాత' సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈషా.. ఒక వైపు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు పలు సినిమాల్లో కీలక పాత్రలలో మెరుస్తోంది. అలాగే తమిళ్ లోనూ ఒకట్రెండు సినిమాలు చేస్తోంది. అయితే తెలుగు వారికి టాలెంట్ కి తగ్గట్లుగా టాలీవుడ్ లో అవకాశాలు రావట్లేదని చెప్పే ఈషా.. ఇప్పుడు బయట పరిశ్రమలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకోవడం తనకి సంతోషాన్ని ఇచ్చే విషయమనే చెప్పాలి.
Also Read