నేడు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు
on Sep 25, 2020
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీనే కాకుండా దేశం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అశేష అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సమ్మోహనకరమైన నవ్వును ఇక మనం చూడలేకపోయినా, మన హృదయాల్లో ఆయన చిరంజీవిగా ఉంటారనేది నిజం.
చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో తుదిశ్వాస విడిచిన బాలు భౌతిక కాయాన్ని ఆయన నివాసం దగ్గర శనివారం ఉదయం వరకు ఉంచనున్నారు. 10.30 గంటలకు ఆయన అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభం కానున్నది. శుక్రవారం రాత్రి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ముఖ్యమైన ప్రకటన చేశారు. తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక లాంఛనాలతో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.
బాలు అంత్యక్రియలు చెన్నై తామరైపాకంలోని ఫామ్హౌస్లో జరగనున్నాయి. అంత్యక్రియలకు అభిమానులెవరూ రావద్దని పోలీసులు కోరారు. కరోనా కారణంగా భౌతిక దూరం పాటించే వీల్లేకుండా అభిమానుల తాకిడి అంతకంతకూ పెరుగుతుండటంతో కుటుంబసభ్యులతో కలిసి పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read