రవితేజ 'క్రాక్'పై పుకార్లను ఖండించిన నిర్మాత
on Jul 14, 2020
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా సినిమా 'క్రాక్'. రెండు మూడు రోజులుగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనీ, డైరెక్ట్-టు-ఓటీటీ రిలీజ్కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ పుకార్లను నిర్మాత 'ఠాగూర్' మధు ఖండించారు. తమ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
"షూటింగ్స్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో మాకు తెలియదు. మేము ఇంకా 15 డేస్ షూటింగ్ చేస్తే 'క్రాక్' కంప్లీట్ అవుతుంది. సో... ఓటీటీకి సినిమా ఇవ్వడానికి డిస్కషన్స్ చేస్తున్నామనే మాటే లేదు. థియేటర్లలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం" అని 'ఠాగూర్' మధు అన్నారు.
'డాన్ శీను', 'బలుపు' తరవాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీస్ రోల్ చేస్తున్నారు.