మోసపోయిన తాప్సీ..!
on Oct 4, 2016
భారతదేశంలోని చాలా మంది తారల డ్రీమ్ బాలీవుడ్ సినిమాల్లో నటించి వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించాలనే. అందుకోసం ఒక్కో మెట్టు ఎక్కుతూ తమ అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటారు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ చాలా మంది నటిమణులకు జీవితంలో ఎదిగేందుకు మొదటి అవకాశాన్ని ఇచ్చింది దక్షిణాది చిత్ర పరిశ్రమే. ఇక్కడి జనం నోళ్లలో బాగా నానిన తర్వాతే చాలా మందికి ముంబై ఆఫర్ వచ్చింది. కాని ముంబైలో అడుగుపెట్టిన వెంటనే అప్పటి దాకా ఆదుకున్న దక్షిణాదిపై నోరు పారేసుకున్న వారిని మనం చాలా మందిని చూశాం. ఆసిన్, త్రిష, ఇలియానా, రాధికా ఆప్టే, విద్యాబాలన్ ఇలా చాలా మందే ఉన్నారు.
తాజాగా ఈ లిస్ట్లోకి ఎంటరైంది తాప్సీ. పింక్ చిత్రం విజయంతో ఫస్ట్ హిందీ హిట్ తన ఖాతాలో వేసుకున్న తాప్సీ సౌత్ ఇండస్ట్రీపై ఆరోపణల దాడి చేస్తోంది. తాను తొలి రోజుల్లో అక్కడ తగిన మర్యాదను పొందలేదని, తన డైలాగ్ డెలివరి బాగోలేదని కొందరు నటులు కించపరచారని ఆరోపించింది. పారితోషకం విషయంలోనూ చాలా సార్లు మోసపోయానని. తనకు ఇచ్చిన చాలా చెక్కులు బౌన్సు అయ్యాయని తెలిపింది. ఇలా డైరెక్టర్లు, ప్రోడ్యూసర్లతో పాటు తన తోటినటులను సైతం వదలకుండా దుమ్ము దులిపేసింది.