సీబీఐ తీరుకి నిరసనగా సుశాంత్ స్నేహితుల నిరాహారదీక్ష
on Sep 29, 2020
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ లోకాన్ని విడిచి మూడు నెలలు దాటింది. అతను మరణించిన నెల రోజులకు కేసును సిబిఐకి అప్పగించారు. ఇప్పటికీ ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. సుశాంత్ ఆత్మహత్య కేసు కాస్తా డ్రగ్స్ కేసు కింద మారింది. అసలు అంశం పక్కకు వెళ్తోందని సుశాంత్ అభిమానులు బాధపడుతున్నారు. అతని స్నేహితులు నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు.
సుశాంత్ మరణం తర్వాత 'జస్టిస్ ఫర్ సుశాంత్' అని అతడి అభిమానులు నినదిస్తున్నారు. దర్యాప్తును వేగవంతం చేయకుండా సిబిఐ ఆలస్యం చేస్తోందని సుశాంత్ స్నేహితుడు, కొరియోగ్రాఫర్ గణేష్ హివారికిర్, సుశాంత్ దగ్గర పనిచేసిన అంకిత్ ఆచార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు ఎంతవరకు వచ్చిందో చెప్పాలని కోరుతూ అక్టోబర్ 2 నుండి 5వ తారీకు వరకు మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఒక వీడియో విడుదల చేశారు. సుశాంత్ కి న్యాయం జరగాలని అంతకు మించి తమ ఎజెండా ఏదీ లేదని వారు పేర్కొన్నారు.
Also Read