మల్టిస్టారర్కి సూర్య గ్రీన్ సిగ్నల్!
on Nov 22, 2020
'సూరారై పొట్రు' (తెలుగులో 'ఆకాశం నీ హద్దురా')తో మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చేశారు సూర్య. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ స్టార్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నిర్మిస్తున్న 'నవరస' అనే ఆంథాలజీలో భాగంగా ఈ లఘు చిత్రం తెరకెక్కుతోంది. అలాగే పాండిరాజ్, వెట్రిమారన్ దర్శకత్వంలోనూ సినిమాలు చేయనున్నారు సూర్య.
కాగా తాజాగా తన మెంటార్, స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో ఓ మల్టిస్టారర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట సూర్య. ఇందులో సూర్యతో పాటు ఆర్య, అధర్వ మురళి కూడా కథానాయకులుగా నటించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించి మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశముంది.
బాలా దర్శకత్వంలో రూపొందిన 'నంద'తోనే సూర్య కెరీర్ టర్న్ అయింది. ఆపై 'పితామగన్' కోసం మరోసారి ఈ ఇద్దరు జట్టుకట్టారు. ఇందులో విక్రమ్ మెయిన్ లీడ్గా నటించగా.. సూర్య సెకండ్ లీడ్లో దర్శనమిచ్చారు. మరి.. సుదీర్ఘ విరామం తరువాత సూర్య, బాలా కాంబోలో రాబోతున్న ఈ సినిమా.. వారిద్దరికి హ్యాట్రిక్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.
Also Read