కబాలి-2ని అల్లుడికిచ్చిన రజినీ..
on Aug 30, 2016
సూపర్స్టార్ రజనీకాంత్, యంగ్ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన కబాలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా ప్రేక్షకులను అలరించకపోయినా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఒక్క విషయం చాలు రజినీ స్టామినా ఎంటో. అయితే కబాలి అభిమానుల అంచనాలను సరిగా అందుకోలేదని..అందువల్ల వారు బాగా నిరాశకు గురయ్యారని రజినీ భావిస్తున్నారు. దీంతో కబాలికి సీక్వెల్ తీసి వారిని ఖుషి చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని రజనీకాంత్ అల్లుడు ధనుష్ తన అఫీషియల్ సైట్ ద్వారా వెల్లడించారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కబాలి సీక్వెల్ని "ఉండర్బార్ ఫిలింస్ పతాకం"పై తనే నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. దర్శకుడిగా పా.రంజిత్కే మళ్లీ ఛాన్సిచ్చాడు రజినీ. సూపర్స్టార్ ప్రస్తుతం 2.0తో బిజీగా ఉండటంతో వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.