త్రిష కోరిక తీరుతుందా.??
on Nov 16, 2016
త్రిష ముఖానికి రంగేసుకుని పుష్కరకాలం దాటిపోయింది. ఇన్నేళ్ల లాంగ్ గ్యాప్లో సౌత్లోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. హీరోయిన్గా టాప్ పొజిషన్కు వెళ్లినా..స్టార్లతో ఆడిపాడినా ఆమెకు ఒక తీరని కోరిక ఉందట. అదేంటంటే సౌతిండియన్ సూపర్స్టార్ రజనీకాంత్తో నటించడమే. తన కన్న వెనుక వచ్చిన వారు..నిన్న గాక మొన్న వచ్చిన భామలంతా రజనీతో స్టెప్పులు వేశారు..కానీ తనకు మాత్రం ఆ ఛాన్ప్ రావడం లేదని ఆమె చాలాసార్లు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె కల త్వరలోనే నిజం అయ్యే అవకాశాలున్నాయంటున్నారు కోలివుడ్ వర్గాలు. పా రంజిత్ దర్శకత్వంలో రజనీ నటించిన కబాలికి సీక్వెల్ నిర్మిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం త్రిషను అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ సినిమాకు రజనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.