కూతురు నిషాతో పెయింటింగ్ చేయిస్తోన్న సన్నీ!
on Sep 24, 2020
లాక్డౌన్ పీరియడ్లోనే కొంత కాలం క్రితం ముంబై నుంచి భర్త, పిల్లలతో కలిసి లాస్ ఏంజెల్స్కు వెళ్లింది బాలీవుడ్ బాంబ్షెల్ సన్నీ లియోన్. గ్లోబల్ పేండమిక్ కాలంలో తాము క్షేమంగానే ఉన్నామని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పిక్చర్లు, వీడియోల ద్వారా షేర్ చేస్తూ వస్తోంది. అలాగే భర్త, పిల్లలతో చేసే యాక్టివిటీస్ను కూడా ఆమె పంచుకుంటోంది. ఈసారి పిల్లల లేటెస్ట్ ఇంటరెస్ట్ పెయింటింగ్ అని అర్థమవుతోంది.
లాజ్ ఏంజెల్స్లో భర్త డేనియల్ వెబర్, పిల్లలు నిషా కౌర్, అషర్ కౌర్, నోవాలతో గడుపుతూ, ప్రతిరోజూ పిల్లలతో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తోంది సన్నీ. కొన్ని రోజుల క్రితం తన పిల్లలను ఒక ఫామ్కు, బీచ్కు, ఆఖరుకు డెమో ఫైర్ డ్రిల్కు తీసుకు వెళ్లిందామె. ఇప్పుడు సన్నీ పిల్లలు పెయింటింగ్పై ఆసక్తి పెంచుకున్నారు.
తాజాగా కూతురు నిషాతో కలిసున్న ముచ్చటగా అనిపిస్తోన్న ఒక పిక్చర్ను షేర్ చేసింది సన్నీ. అందులో ఆ తల్లీకూతుళ్లు ఒక పెయింటింగ్ను తయారుచేస్తూ కనిపిస్తున్నారు. సన్నీ బేబీ పింక్ జంప్సూట్లో కనిపిస్తుండగా, చిన్నారి నిషా వైట్ టీ ష్టర్, పింక్ ట్రౌజర్స్లో ముద్దొస్తోంది. ఆ పిక్చర్కు "Working together as a team!! My little princess Nisha." అనే కాప్షన్ జోడించింది సన్నీ.
Also Read