ప్చ్ .. రాజమౌళి ఇలా చేశాడేంటి..?
on Nov 20, 2017
బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ఖ్యాతి దేశవిదేశాల్లో మారుమోగిపోయింది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా.. చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా అందరూ ఆయన డైరెక్షన్లో ఒక్క సీన్లో అయినా నటించాలని కోరుకుంటున్న వారే. బాహుబలి తర్వాత ఆయన ఏం చేస్తాడు..? ఏ సినిమా చేస్తాడు..? ఎవరితో చేస్తాడు..? అంటూ హాట్ డిబేట్లు నడుస్తున్న సమయంలో చెర్రీ-ఎన్టీఆర్ మల్టీస్టారర్ ప్రకటించి షాక్ ఇచ్చాడు జక్కన్న. మంచివార్తే కదా..? షాక్ అంటారేంటి అని మీరు అనుకోవచ్చు. బాహుబలి తర్వాత రాజమౌళి ఇండియన్ సినిమాను ఒక మెట్టుపైకి ఎక్కించాడు రాజమౌళి..
ఆ తర్వాత తీయబోయే సబ్జెక్ట్ ఇంకా గొప్పదై ఉంటుందని ఫిల్మ్ క్రిటిక్స్తో పాటు అభిమానులు భావించారు. దానికి తగ్గట్టే తన తండ్రి విజయేంద్రప్రసాద్ సాయంతో రాజమౌళి మహాభారతాన్ని ఐదు భాగాలుగా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో నిజం ఉందో లేదో అన్న విషయాన్ని పక్కనబెట్టి ఈ వార్త వినగానే సినీ అభిమానులు చాలా సంతోషించారు. ఈ మూవీ ఎప్పుడు పట్టాలకెక్కుతుంది, ఎవరెవరు నటిస్తారు, ప్రొడ్యూసర్ ఎవరు.. ఎవరెవరు ఏ పాత్రలు ధరించబోతున్నారు అంటూ చర్చ నడుస్తుండగానే చెర్రీ-ఎన్టీఆర్ మూవీని అనౌన్స్ చేశాడు రాజమౌళి. హిస్టారికలో, మైథలాజికలో, ఫాంటసీ ఇలాంటి జోనర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇలా చేశాడేంటి అంటూ అభిమానులు కాస్త ఫీలవుతున్నారు.