శ్రీదేవికి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు కానీ...
on Feb 26, 2018
అతిలోక సుందరి ఇక లేదు అన్న విషయం మనకే ఇంతగా బాధ కలిగిస్తుంటే... ఇక ఆమె కుటుంబ సభ్యుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటుడు మరియు బంధువు మోహిత్ మార్వా పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వారం క్రితం భార్య శ్రీదేవి, చిన్న కూతురు ఖుషి కపూర్ తో కలిసి దుబాయ్ వెళ్లినప్పటికీ, వేరే పనుల రీత్యా బోనీ ముంబై కి వచ్చాడు. అయితే, శ్రీదేవి కి సర్ప్రైజ్ ఇద్దామని ఆమెకు చెప్పకుండా దుబాయ్ కి వెళ్ళాడట. ఆమె ఉంటున్న జ్యూమెయిరాహ్ ఎమిరేట్స్ టవర్స్ హోటల్ రూమ్ కి శనివారం సాయంత్రం దాదాపు 5 :30 కి చేరుకున్నాడట. పడుకున్న శ్రీదేవిని లేపి ఒక 15 నిమిషాలు ముచ్చటించి డిన్నర్ కి వెళ్దాం అని చెప్పాడట. రెడీ అవ్వడానికి శ్రీదేవి వాష్ రూమ్ కి వెళ్లిందట. వెళ్లిన 15 నిమిషాలకి కూడా శ్రీదేవి ఇంకా బయటకు రాకపోవడంతో, డోర్ ని తట్టి పిలిచాడట. లోపలి నుండి రెస్పాన్స్ లేకపోవడంతో డోర్ ని బలవంతంగా తెరిచాడట. తీరా చూస్తే, నీటితో నిండిన బాత్ టబ్ లో శ్రీదేవి విగత జీవిగా పడి ఉందట. కృత్రిమ శ్వాస ద్వారా బ్రతికించే ప్రయత్నం చేసి విఫలం అవ్వడంతో తన మిత్రుడికి ఫోన్ చేసి హోటల్ రూమ్ కి రమ్మన్నాడట. రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతంలో పోలీసులని పిలిచి జరిగిందంతా వివరించాడట. పోలీసులు వచ్చాక శ్రీదేవి పార్థీవ దేహాన్ని పోస్ట్ మార్టం కి పంపించారట. భార్యకి సర్ప్రైజ్ ఇద్దామని వెళ్లిన బోనీ కపూర్ కి శ్రీదేవి మరణం నిజంగా పెద్ద షాకే! అభిమానులుగా మనమే ఈ వార్త జీర్ణించుకోలేకుండా ఉన్నాం ఉంటే, ఇక ఆమెతో జీవితం గడిపిన బోనీ కపూర్ ఎప్పటికి తేరుకుంటాడో!