రొమాంటిక్ థ్రిల్లర్ గా శ్రీముఖి..
on Jan 13, 2017
బుల్లితెరపై యాంకర్ గా శ్రీముఖి ఇప్పటికే తన సత్తా చాటుతూ మంచి ఫామ్ లో ఉంది. ఇప్పుడు శ్రీముఖి కూడా అనుసూయ, రష్మీల రూట్ లోకి వచ్చేసింది. శ్రీముఖి కూడా త్వరలో ఓ సినిమాతో అభిమానులను అలరించేందుకు రెడీ అయింది. అది కూడా మనం లాంటి గొప్ప చిత్రానికి రైటర్ గా పని చేసిన హర్ష వర్ధన్ సినిమాలో. ఇప్పటికే నటుడిగా, రచయితగా అలరించిన హర్ష వర్దన్ ఇప్పుడు డైరెక్టర్ గా తన డెబ్యూ సినిమాకు గాను శ్రీముఖిని ఎంపికి చేసుకున్నట్టు తెలుస్తోంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఒక అమ్మాయి తప్ప ప్రొడ్యూసర్ అంజి రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.