`శ్రీకారం`.. క్రిస్ప్ రన్ టైమ్!
on Mar 8, 2021
యువ కథానాయకుడు శర్వానంద్ రైతు అవతారమెత్తిన చిత్రం `శ్రీకారం`. నూతన దర్శకుడు బి. కిశోర్ రూపొందించిన ఈ సోషల్ డ్రామాలో శర్వాకి జోడీగా `గ్యాంగ్ లీడర్` ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మించిన ఈ చిత్రం.. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న థియేటర్స్ లోకి రానుంది.
ఇదిలా ఉంటే.. `శ్రీకారం` చిత్ర నిడివికి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. క్లీన్ `యు` సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా డ్యూరేషన్ కేవలం 132 నిమిషాలేనట. 2 గంటల 12 నిమిషాల క్రిస్ప్ రన్ టైమ్.. అనేది కచ్చితంగా కలిసొచ్చే అంశమనే చెప్పాలి.
కాగా, `మహానుభావుడు` తరువాత సరైన విజయం లేని శర్వానంద్ కి `శ్రీకారం` సక్సెస్ కీలకమనే చెప్పాలి. మరి.. `శ్రీకారం`తో శర్వానంద్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
ఇదిలావుంటే.. శర్వానంద్ చేతిలో ప్రస్తుతం మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. `మహాసముద్రం`, `ఆడాళ్ళు మీకు జోహార్లు`తో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న బైలింగ్వల్ మూవీ తన ఖాతాలో ఉన్నాయి.