ఎస్పీ బాలుకి కరోనా...
on Aug 5, 2020
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు. ఫేస్ బుక్ లో బుధవారం ఉదయం పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ విషయం ధ్రువీకరించారు.
"రెండు మూడు రోజులుగా నాకు అసౌకర్యంగా ఉంటోంది. కాస్త జలుబు ఉంది. జ్వరం వచ్చి వెళుతూ ఉంది. కఫం పట్టినట్టు అనిపిస్తుంది. ఈ మూడు తప్ప నాకు మరో సమస్య లేదు. అయితే, వీటిని ఈజీగా తీసుకోకూడదని ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నాను. వెరీ మైల్డ్ కరోనా పాజిటివ్ అని తేలింది. హోం క్వారంటైన్ లో ఉంటూ మందులు వేసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు. కానీ నేను ఆ పని చేయలేదు. ఆస్పత్రిలో చేరాను. కుటుంబ సభ్యులు నా ఆరోగ్యం గురించి చాలా ఆలోచిస్తున్నారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు అయితే వాటిని రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. రెండు రోజుల్లో నేను డిశ్చార్జ్ అవుతాను" అని ఎస్పీ బాలు పేర్కొన్నారు. ఫోనులు చేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇటీవల పాప్ సింగర్ స్మిత కు సైతం కొవిడ్ వైరస్ సోకిన సంగతి తెలిసిందే.