దీపావళికి 'సూర్యవంశీ'... క్రిస్మస్కి '83'?
on Jun 30, 2020
థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ఒకవేళ ఓపెన్ అయితే మార్చికి ముందు ప్రేక్షకులు ఎలా అయితే సినిమాలు చూడటానికి వచ్చారో... అలా వస్తారా? కరోనా సోకకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? వంటివి ఇంకా సమాధానం లభించని ప్రశ్నలుగా మిగిలాయి. అయితే, రాబోయే సీజన్స్ మీద బాలీవుడ్ నిర్మాతలు కన్నేశారు. రిలీజ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'సూర్యవన్షీ'ని దీపావళి ఫెస్టివల్ సీజన్లో, 1983లో టీమిండియా వరల్డ్ కప్ ముద్దాడిన సంఘటనల ఆధారంగా రణవీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన '83' సినిమాను క్రిస్మస్ ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్లీ... కరోనాకి ముందు మార్చి 24న 'సూర్యవన్షీ', ఏప్రిల్ 10న '83' రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, కరోనా అంతా నాశనం చేసింది.
Also Read