సితారలో కృష్ణ అలియాస్ సిద్ధూ...
on Jul 14, 2020
ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త కొత్త కథలు, కాంబినేషన్లతో సినిమాలు సెట్ చేసే పనిలో బిజీగా ఉంది. రవితేజ, రానా హీరోలుగా మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియుమ్'ను రీమేక్ చేస్తున్నట్టు, మరో మలయాళ సినిమా 'కప్పెల్లా' రీమేక్ రైట్స్ కొన్నట్టు ప్రకటించింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసింది.
'గుంటూర్ టాకీస్'తో సిద్ధూ జొన్నలగడ్డ ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. లేటెస్ట్ ఓటీటీ రిలీజ్ 'కృష్ణ అండ్ హిజ్ లీల'తో హిట్ కొట్టాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అతణ్ణి ఓ సినిమాకి హీరోగా తీసుకుంది. న్యూ ఏజ్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్న ఈ సినిమాతో విమల్ కుమార్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ ఫుల్ స్వింగులో జరుగుతోందట.
ఆల్రెడీ సితార ఎంటర్టైన్మెంట్స్ లో నితిన్ హీరోగా 'రంగ్ దే' ప్రొడక్షన్ లో ఉంది. నాని హీరోగా టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తో 'శ్యామ్ సింఘ రాయ్' అనౌన్స్ చేశారు. షూటింగ్స్ స్టార్ట్ అయ్యేలోపు మరిన్ని సినిమాలు సెట్ చేసేలా ఉన్నారు.