'పుష్ప'లో విలన్గా కాంట్రవర్షియల్ హీరో?
on Jan 18, 2021
ఆర్య, ఆర్య2 తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప. గత రెండు సినిమాలకు భిన్నంగా యాక్షన్ థ్రిల్లర్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. అంతేకాదు.. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో సందడి చేయనుంది. బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని విలన్ పాత్ర కోసం గతంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో చర్చలు జరిపింది యూనిట్. అయితే కాల్షీట్ల సమస్య కారణంగా ఈ సినిమా చేయలేకపోయాడు విజయ్. ఈ నేపథ్యంలో.. ఆ స్థానంలో పలువురు ప్రముఖ నటులు పేర్లు వినిపించాయి. అయితే ఎవరి పేరూ కన్ఫామ్ కాలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కోలీవుడ్ కాంట్రవర్శియల్ హీరో శింబు.. పుష్పలో ప్రతినాయకుడిగా నటించే అవకాశముందట. మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.