శృతి హాసన్ ఇప్పుడవి చేయలేదట!
on Nov 16, 2019
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ కథానాయికలు ఎవరున్నారు? అని చూస్తే శృతి హాసన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. 'గబ్బర్ సింగ్', 'బలుపు', 'రామయ్యా వస్తావయ్యా', 'ఎవడు', 'రేసు గుర్రం', 'శ్రీమంతుడు', 'కాటమరాయుడు'... ఏ సినిమాలో చూసినా, పాత్రల పరంగా శృతి హాసన్ ప్రయోగాలు చేసిన సందర్భాలు అరుదుగా కనిపిస్తాయి. కమర్షియల్ స్పేస్ లో ఎక్కువ సినిమాలు చేశారామె. పవన్ కల్యాణ్ తో 'కాటమరాయుడు' చేసిన తర్వాత రెండేళ్లు ఇండస్ట్రీ నుండి శృతి హాసన్ గ్యాప్ తీసుకున్నారు. మళ్ళీ రవితేజ 'క్రాక్'తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త పాత్రలు, ప్రయోగాత్మక సినిమాల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు కెరీర్ లో తానొక డిఫరెంట్ ఫేజ్ లో ఉన్నానని శృతి హాసన్ అంటున్నారు.
"నేను కొన్నేళ్ల క్రితం చేసిన పాత్రలను ఇప్పుడు చేయలేను. గతంలో నేను చేసిన క్యారెక్టర్స్ ను మళ్ళీ రిపీట్ చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే... ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నాను. డిఫరెంట్ జానర్స్ లో డిఫరెంట్ రోల్స్ చేయాలనుంది. ఎక్కువశాతం మంది ప్రేక్షకులకు చేరువయ్యే, నటిగా సంతృప్తి ఇచ్చే పాత్రలను చేయడానికి ఇష్టపడుతున్నాను" అని శృతి హాసన్ పేర్కొన్నారు. ఆల్రెడీ తెలుగులో సినిమా స్టార్ట్ అయింది కాబట్టి ఆమెకు వరుసగా అవకాశాలు వస్తాయి.
Also Read